MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Andhra Pradesh
  • తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు .. ఒకేరోజు మూడు బస్సు యాక్సిడెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు .. ఒకేరోజు మూడు బస్సు యాక్సిడెంట్స్

Bus Accident : తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు బస్సు ప్రమాదాలు జరిగాయి… ఇందులో కొందరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా చాలామంది గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదాలు ఎక్కడెక్కడ జరిగాయంటే..

2 Min read
Author : Arun Kumar P
Published : Nov 04 2025, 08:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు
Image Credit : X/gaffar5593

తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు

Bus Accident : తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కర్నూల్, చేవెళ్ల బస్సు ప్రమాదాలను మర్చిపోకముందే మరికొన్ని దుర్ఘటనలు సంభవించాయి. ఇవాళ (మంగళవారం తెల్లవారుజామున) ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో ప్రైవేట్, ఆర్టిసి బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. ఇందులో పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఏలూరులో ట్రావెల్స్ బస్సు ప్రమాదం
Image Credit : Twitter

ఏలూరులో ట్రావెల్స్ బస్సు ప్రమాదం

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయ్యింది... గత రాత్రి (నవంబర్ 03న) ఏలూరు నుండి హైదరాబాద్ కు బయలుదేరిన భారతి ట్రావెల్స్ బస్సు మార్గమధ్యలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్నవెంటనే స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం జూబ్లీనగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారు ప్రస్తుతం లింగంపాలెం ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

Related Articles

Related image1
తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న పిడుగుల ప్రమాదం.. ఈ జాగ్రత్తలు పాటించండి, సేఫ్ గా ఉండండి
Related image2
ఓరి దేవుడా ఎంతటి విషాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ, భారీగా మృతుల సంఖ్య
34
సత్యసాయి జిల్లాలో బస్సు ప్రమాదం
Image Credit : Asianet News

సత్యసాయి జిల్లాలో బస్సు ప్రమాదం

ఇదిలావుంటే సత్యసాయి జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుండి హైదరాబాద్ కు వస్తున్న జబ్బర్ ట్రావెల్స్ బస్సు మార్గమధ్యలో సత్యసాయిజిల్లాలో ప్రమాదానికి గురయ్యింది. చెన్నె కొత్తపల్లి మండలం దామాజిపల్లి వద్ద వేగంగా వెళుతున్న బస్సు ఒక్కసారిగా మరో వాహనాన్ని ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందగా 8 మంది ప్రయాణికులకు గాయాలపాలయ్యారు. వీరు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.

44
కరీంనగర్ లో బస్సు ప్రమాదం
Image Credit : Asianet News

కరీంనగర్ లో బస్సు ప్రమాదం

నిన్న చేవెళ్లలో జరిగిన ఘోర బస్సు ప్రమాదాన్ని మర్చిపోకముందే ఇవాళ తెల్లవారుజామున కరీంనగర్ లో మరో ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ మండలం రేణిగుంట బ్రిడ్జి వద్ద ఆర్టిసి బస్సు ప్రమాదానికి గురయ్యింది... వేగంగా వెళుతున్న బస్సు ముందు వెళుతున్న ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ నుండి హైదరాబాద్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు... స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి... బస్సు ఎక్కాలంటేనే ప్రజలు భయపడిపోయే పరిస్థితి నెలకొంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
విశాఖపట్నం
విజయవాడ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
వద్దన్నా వినకుండా మత్సకారులతో సముద్రంలోకెళ్ళిన CM Chandrababu | Asianet Telugu
Recommended image2
Now Playing
అడ్డొచ్చిన జగన్ ని కూడా... అంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చిన Kotam Reddy | Vijaysai Reddy VS Sajjala Issue
Recommended image3
Ishtakameshwari Temple: గుండె ధైర్యం ఉంటేనే ఇక్కడికి వెళ్లగలరు.. నల్లమల అడవుల్లో మనిషిలా మారే విగ్రహ ఆలయం !
Related Stories
Recommended image1
తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న పిడుగుల ప్రమాదం.. ఈ జాగ్రత్తలు పాటించండి, సేఫ్ గా ఉండండి
Recommended image2
ఓరి దేవుడా ఎంతటి విషాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ, భారీగా మృతుల సంఖ్య
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved