MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Andhra Pradesh : ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులివే.. ఈ ప్రాంతాలకు మహర్ధశ

Andhra Pradesh : ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులివే.. ఈ ప్రాంతాలకు మహర్ధశ

Andhra Pradesh : సూపర్ జిఎస్టి - సూపర్ సేవింగ్ పేరిట కర్నూల్ లో చేపట్టిన భారీ బహిరంగ సభ వేదికపైనుండి ఏపీ రూపురేఖలు మార్చే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు ప్రధాని మోదీ. 

2 Min read
Arun Kumar P
Published : Oct 16 2025, 05:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏపీలో భారీ పెట్టుబడులతో అభివృద్ధి పనులు
Image Credit : X

ఏపీలో భారీ పెట్టుబడులతో అభివృద్ధి పనులు

Andhra Pradesh : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆంధ్ర ప్రదేశ్ పేరు మారుమోగుతోంది. ఇటీవలే గ్లోబల్ టెక్ దిగ్గజం ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది... ఈమేరకు కూటమి ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. మొత్తం 15 బిలియన్ డాలర్లు అంటే 1,33,000 కోట్లతో విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఏపీలో భారీ పెట్టుబడులతో కూడిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

25
మారుతున్న ఏపీ రూపురేఖలు
Image Credit : X/Telugudesam Party

మారుతున్న ఏపీ రూపురేఖలు

'సూపర్ జీఎస్టి - సూపర్ సేవింగ్స్' పేరిట కర్నూల్ లో కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రజలు కూడా భారీసంఖ్యలో హాజరయ్యారు. ఈ సభావేదికపైనుండి ప్రధాని ఏకంగా రూ. 13429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

Related Articles

Related image1
Andhra Pradesh: ఏపిలో ల్యాండ్ అయిన ప్ర‌ధాని.. మోదీ రాక‌తో ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం
Related image2
Andhra Pradesh : ప్రధాని మోదీకి గూగుల్ సీఈవో ఫోన్ .. వైజాగ్ డేటా సెంటర్ పై ఆసక్తికర చర్చ
35
ప్రధాని ప్రారంభించిన అభివృద్ధి పనులు
Image Credit : N Chandrababu Naidu/X

ప్రధాని ప్రారంభించిన అభివృద్ధి పనులు

ప్రధాని నరేంద్ర మోదీ కర్నూల్ సభనుండే వర్చువల్ గా రూ. 9449 కోట్ల విలువైన 5 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

1. రూ. 2886 కోట్లతో చేపట్టిన విద్యుత్ ట్రాన్స్ మిషన్ (విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుండి సబ్ స్టేషన్లు అక్కడినుండి వినియోగదారులను విద్యుత్ సరఫరా చేసే) వ్యవస్థ పనులకు ప్రధాని మోదీ ప్రారంభించారు.

2. రూ. 4922 కోట్లు చేపట్టిన ఓర్వకల్లు-కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ పనులను ప్రారంభించారు. ఇది కర్నూల్ జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి మధ్య పారిశ్రామిక అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రాజెక్ట్. దీన్ని ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చేపడుతోంది.

3. ఇక పలు జాతీయ రహదారుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను కూడా ప్రధాని ప్రారంభించారు. ఇలా కొత్త వలస - విజయనగరం మధ్య రూ. 493 కోట్లతో చేపట్టిన 4వ లైన్ ను కు శంకుస్థాపన చేశారు.

4. పెందుర్తి - సింహాచలం నార్త్ మధ్య రూ. 184 కోట్లతో చేపట్టిన రైల్ ఫ్లైఓవర్ లైన్ పనులను కూడా ప్రధాని ప్రారంభించారు.

5. సబ్బవరం-షీలానగర్ మధ్య రూ.964 కోట్లతో చేపట్టిన జాతీయ రహదారి పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు.

45
ప్రధాని మోదీ చేపట్టిన ప్రారంభోత్సవాలు
Image Credit : N Chandrababu Naidu/X

ప్రధాని మోదీ చేపట్టిన ప్రారంభోత్సవాలు

ప్రధాని నరేంద్ర మోదీ రూ. 1704 కోట్ల విలువైన 8 అభివృద్ధి పనులను ప్రారంభించారు.

1. రూ. 82 కోట్లతో చేపట్టిన రేణిగుంట - కడప - మదనపల్లె రోడ్డును ప్రారంభించారు.

2. రూ. 286 కోట్లతో నిర్మించిన కడప – నెల్లూరు - చునియంపల్లి రోడ్డును ప్రారంభించారు.

3. రూ.70 కోట్లతో నిర్మించిన కనిగిరి బైపాస్ రోడ్ ను కూడా ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు.

4. రూ.98 కోట్లతో చేపట్టిన గుడివాడ-నూజెండ్ల 4లేన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించారు.

5. రూ.13 కోట్లతో చేపట్టిన కల్యాణదుర్గం - రాయదుర్గం - మొలకలమూరు రోడ్డును ప్రారంభించారు.

6. రూ. 593 కోట్లతో నిర్మించిన పీలేరు - కలసూర్ నాలుగు లేన్ల రోడ్డు ప్రారంభం

7. రూ.362 కోట్లతో చేపట్టిన నిమ్మకూరులోని BELలో అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ గ్లాసుల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు.

8. రూ. 200 కోట్లతో ఏర్పాటుచేసిన చిత్తూరులోని ఇండేన్ బాట్లింగ్ ప్లాంట్ ను ప్రారంభించారు.

55
జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులు
Image Credit : X/Telugudesam Party

జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులు

ప్రధాని నరేంద్ర మోదీ రూ. 2276 కోట్ల విలువైన 2 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.

1. కొత్తవలస –కొరాపుట్ రైల్వే డబ్లింగ్ పనులు రూ. 546 కోట్లతో పూర్తిచేశారు.

2. శ్రీకాకుళం- అంగుల్ నాచురల్ గ్యాస్ పైప్‌లైన్ పనులు రూ. 1730 కోట్లతో పూర్తిచేశారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
నరేంద్ర మోదీ
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
నారా లోకేష్
పవన్ కళ్యాణ్
తెలుగుదేశం పార్టీ
ఏషియానెట్ న్యూస్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved