MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • తీరంవైపు దూసుకొస్తున్న మొంథా తుపాను.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

తీరంవైపు దూసుకొస్తున్న మొంథా తుపాను.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

Montha Cyclone : మొంథా తుపాను తీరం దాటే ముందు కాకినాడ జిల్లాలో రక్షణ చర్యలను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. 12 మండలాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

2 Min read
Mahesh Rajamoni
Published : Oct 27 2025, 06:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సిద్ధంగా ఉండండి : పవన్ కళ్యాణ్
Image Credit : Pawan Kalyan Twitter

సిద్ధంగా ఉండండి : పవన్ కళ్యాణ్

మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం జిల్లా పరిధిలోని 12 మండలాల్లో తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉంది. అందువల్ల అన్ని శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు.

ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలను వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలించి పునరావాస కేంద్రాల్లో ఉంచాలని అన్నారు.

25
పునరావాస చర్యలు వేగవంతం చేసిన సర్కారు
Image Credit : Freepik

పునరావాస చర్యలు వేగవంతం చేసిన సర్కారు

గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, రోగులను ముందుగా గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రత్యేకంగా పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటికే 142 మంది గర్భిణులను గుర్తించి తరలించినట్టు జిల్లా కలెక్టర్ మోహన్ వివరించారు.

260 పునరావాస కేంద్రాలు సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, పాలు, అత్యవసర మందులు అందుబాటులో ఉండాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంబులెన్సులు, అత్యవసర సేవలు సిద్ధంగా ఉండాలని, ఆసుపత్రుల్లో అదనపు బెడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

Related Articles

Related image1
మొంథా తుపాను: పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3 వేలు, 25 కేజీల బియ్యం
Related image2
మొంథా తుపాను ఎఫెక్ట్.. స్కూళ్లకు మూడు రోజులు సెలవులు
35
Montha Cyclone: సిద్ధంగా సహాయక బృందాలు
Image Credit : Pawan Kalyan Twitter

Montha Cyclone: సిద్ధంగా సహాయక బృందాలు

ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్దంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గ్రామాలలో మైకుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని, భయాందోళనలు లేకుండా తుపాను ప్రభావంపై సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.

గజ ఈతగాళ్లను తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున స్తంభాలు కూలితే వెంటనే పునరుద్ధరణ చేపట్టాలని సూచించారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నా శాటిలైట్ ఫోన్ల ద్వారా సమాచారం చేరవేయాలని తెలిపారు.

45
మొంథా తుపాను: భద్రతా పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు
Image Credit : our own

మొంథా తుపాను: భద్రతా పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు

పునరావాస కేంద్రాలకు వెళ్లిన ప్రజల ఇళ్లకు భద్రత కల్పించాలని, దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ పెంచాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పోలీసులు ముంపు ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టాలన్నారు.

ఏలేరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల జరిగే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని నీటి పారుదల శాఖకు సూచించారు. చెరువులు, వాగులు, కుంటల గట్లు బలహీనంగా ఉన్న చోట ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచాలని తెలియజేశారు.

55
మొంథా తుపాను: అత్యవసర నిధుల విడుదల
Image Credit : Asianet News

మొంథా తుపాను: అత్యవసర నిధుల విడుదల

తుపాను ప్రభావిత ప్రాంతాల సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.19 కోట్ల అత్యవసర నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. అందులో కాకినాడ జిల్లాకు రూ.1 కోటి కేటాయించారు.

ఈ నిధులతో పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు, నిత్యవసర సరుకుల పంపిణీ, ఇళ్లు కూలిపోవడం వంటి ఘటనలపై తక్షణ సాయం అందించాలని ఆదేశించారు.

మత్స్యకారుల భద్రతపై కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. వేటకు వెళ్లకుండా చూడాలనీ, పడవలకు రక్షణ చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారులకు సూచించారు. మార్కెటింగ్ శాఖ కూరగాయలు, నిత్యావసర సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
పవన్ కళ్యాణ్
నారా చంద్రబాబు నాయుడు
విశాఖపట్నం
హైదరాబాద్
తెలంగాణ
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved