MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • మంత్రి నారా లోకేశ్ పేరుతో భారీ సైబర్‌ మోసం.. రూ.54 లక్షలు కాజేశారు

మంత్రి నారా లోకేశ్ పేరుతో భారీ సైబర్‌ మోసం.. రూ.54 లక్షలు కాజేశారు

Cyber Fraud Using Lokesh Name: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పేరుతో వాట్సాప్ ఫేక్ ప్రొఫైల్ సృష్టించి దుండగులు భారీ సైబర్ మోసానికి పాల్పడ్డారు. రూ.54 లక్షలు దోచుకున్న ఈ సైబర్ నేరగాళ్లను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.

1 Min read
Mahesh Rajamoni
Published : Oct 29 2025, 11:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
నారా లోకేశ్ పేరుతో సైబర్ క్రైమ్
Image Credit : Nara Lokesh Twitter

నారా లోకేశ్ పేరుతో సైబర్ క్రైమ్

Cyber Fraud Using Lokesh Name : రాష్ట్రంలో సైబర్ నేరాలు కొత్తకొత్త రూపాల్లో విస్తరిస్తున్నాయి. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు సంబంధించిన పేరు, ఫొటోను దుర్వినియోగం చేస్తూ భారీ మోసానికి పాల్పడిన గ్యాంగ్‌ను సీఐడీ అధికారులు పట్టుకున్నారు. 

వాట్సాప్‌లో లోకేశ్‌ ఫొటోను డిస్‌ప్లే పిక్చర్‌గా పెట్టి, బాధితులను బెదిరిస్తూ వారి ఖాతాల్లో భారీ మొత్తాలు జమ చేయించుకున్న సంగతి వెలుగులోకి వచ్చింది. మొత్తం రూ.54 లక్షలు ఈ ముఠా కాజేసినట్టు విచారణలో తేలింది.

23
వాట్సాప్ ఫేక్ ప్రొఫైల్‌తో దందా
Image Credit : Getty

వాట్సాప్ ఫేక్ ప్రొఫైల్‌తో దందా

సైబర్ నేరగాళ్లు ముందుగా మంత్రికి సన్నిహితులు, పార్టీ నాయకులను టార్గెట్ చేశారు. నేరగాళ్లు నారా లోకేశ్ పేరు, ఫొటోలను ఉపయోగించి ఒక నకిలీ వాట్సాప్ ప్రొఫైల్‌ సృష్టించి, అత్యవసరంగా నిధులు కావాలని చెప్పి బాధితులను మోసగించారు. 

పుట్టపర్తికి చెందిన రాజేష్ అనే నిందితుడు ఎన్నారై తెదేపా (తెలుగు దేశం పార్టీ) పేరుతో కూడా గతంలో మోసాలకు పాల్పడినట్టు తెలిసింది. వైద్య సాయం పేరుతో ఇప్పటివరకు సుమారు రూ.50 లక్షలకు పైగా వసూలు చేశాడని అధికారులు గుర్తించారు.

సీఐడీ గతంలోనే రాజేష్‌ను అరెస్ట్ చేసి విచారణ జరిపింది. అతడు ఇచ్చిన వివరాలతో మిగతా నిందితుల జాడలు సీఐడీకి దొరికాయి. తాజాగా హైదరాబాద్‌లో సాయిశ్రీనాథ్, సుమంత్ అనే మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

Related image1
18 లక్షల మందిపై మొంథా తుపాను ప్రభావం.. వారికి రూ.5 లక్షల పరిహారం
Related image2
EPFO కొత్త రూల్స్ : పీఎఫ్ విత్‌డ్రా లో మార్పులు.. మీరు తప్పక తెలుసుకోవాల్సిందే !
33
నిందితులకు రిమాండ్, పోలీసుల అలర్ట్
Image Credit : Freepik

నిందితులకు రిమాండ్, పోలీసుల అలర్ట్

అరెస్టయిన ఇద్దరిని కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో ఇంకా మరికొంత మంది ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నట్టు సీఐడీ వర్గాలు వెల్లడించాయి.

సైబర్ నేరాలపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సందేహాస్పద సందేశాలు వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని అధికారులు సూచిస్తున్నారు. అనుమానాస్పద వాట్సాప్ మెసేజ్‌లను నమ్మి డబ్బులు పంపితే భారీ నష్టాలు తప్పవని హెచ్చరికలు చేశారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
నారా లోకేష్
నేరాలు, మోసాలు
సాంకేతిక వార్తలు చిట్కాలు
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved