MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Yoga Day: ఈసారి యోగా దినోత్సవం విశాఖపట్నంలోనే ఎందుకు నిర్వహిస్తున్నారు? దీని ప్రత్యేకతలు ఏంటి?

Yoga Day: ఈసారి యోగా దినోత్సవం విశాఖపట్నంలోనే ఎందుకు నిర్వహిస్తున్నారు? దీని ప్రత్యేకతలు ఏంటి?

International Yoga Day 2025 in Vizag : యోగా దినోత్సవం 2025 విశాఖలో ఘనంగా జరగనుంది. ప్రధాని మోడీ పాల్గొననుండగా, గిన్నిస్ రికార్డు కోసం లక్షలాది మంది పాల్గొంటారు. అయితే, విశాఖపట్నంలోనే యోగా దినోత్సవాన్ని ఎందుకు పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు?

3 Min read
Mahesh Rajamoni
Published : Jun 19 2025, 06:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
Image Credit : Getty

విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

International Yoga Day Vizag : 2025 జూన్ 21న విశాఖపట్నం నగరం అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదికగా మారనుంది. ప్రపంచవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఈ ఏడాది వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు రాష్ట్ర, కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

28
యోగా దినోత్సవం 2025 థీమ్: యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్
Image Credit : X/@apdigitalcorp

యోగా దినోత్సవం 2025 థీమ్: యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్

ఈ ఏడాది యోగా దినోత్సవం థీమ్ "యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్". దీనిని ప్రధాని మోడీ 2025 మార్చి 30న "మన్ కీ బాత్" రేడియో కార్యక్రమంలో ప్రకటించారు. 

ఈ థీమ్ ద్వారా వ్యక్తిగత ఆరోగ్యమే కాకుండా, భూమి ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. దీనికి అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళికలు ఉండాలని కూడా పేర్కొన్నారు.

Related Articles

Related image1
India: విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? శుభ్‌మన్ గిల్ ఏం చేయబోతున్నాడు?
Related image2
Trump India Pakistan : మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకోమన్న మోడీ.. ఐ లవ్ పాక్ అన్న ట్రంప్.. అమెరికా వ్యాఖ్యలు దేనికి సంకేతం?
38
ఆర్కే బీచ్‌లో పెద్ద ఎత్తున యోగా దినోత్సవ కార్యక్రమ ఏర్పాట్లు
Image Credit : PTI

ఆర్కే బీచ్‌లో పెద్ద ఎత్తున యోగా దినోత్సవ కార్యక్రమ ఏర్పాట్లు

ప్రధాన కార్యక్రమం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు 26.5 కిలోమీటర్ల తీర ప్రాంతంలో జరగనుంది. ఈ ప్రాంగణంలో 2.5 లక్షల మందికి పైగా పాల్గొనేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ యోగా సెషన్ ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 2023లో సూరత్‌లో జరిగిన యోగా కార్యక్రమంలో 1.53 లక్షల మందితో రికార్డు సృష్టించగా, ఇప్పుడు ఆ రికార్డును అధిగమించేందుకు విశాఖ సిద్ధమవుతోంది.

48
యోగాంధ్ర-2025 ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు
Image Credit : Getty

యోగాంధ్ర-2025 ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు

ఈ కార్యక్రమానికి ప్రేరణగా "యోగాంధ్ర-2025" అనే ప్రచారాన్ని సీఎం చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించింది. మే 21 నుంచి జూన్ 21 వరకు నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా యోగా ప్రాముఖ్యతను ప్రజలకు చేరవేసి, ఆరోగ్యవంతమైన జీవనశైలి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగా ఆంధ్ర అనే నెల రోజుల ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలతో ముగుస్తుంది.

58
విశాఖకు గ్లోబల్ గుర్తింపు టార్గెట్ గా ప్రభుత్వ చర్యలు
Image Credit : Getty

విశాఖకు గ్లోబల్ గుర్తింపు టార్గెట్ గా ప్రభుత్వ చర్యలు

నెల రోజుల పాటు జరిగే యోగాంధ్ర వేడుకలకు ప్రభుత్వం ఒక నిర్మాణాత్మక విధానాన్ని ప్లాన్ చేసింది. మొదటి వారం జిల్లా స్థాయి శిక్షణపై దృష్టి సారిస్తుంది, తరువాత రెండవ వారంలో మండల స్థాయి కార్యక్రమాలు, మూడవ వారంలో గ్రామ స్థాయి కార్యక్రమాలు ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 100 పర్యాటక ప్రాంతాలలో ప్రత్యేక ప్రచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా విశాఖపట్నం ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందనుంది. యోగా ప్రాచుర్యం పెరగడమే కాకుండా, ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన కూడా పెరుగుతుంది. ప్రభుత్వ సహకారంతో పాటు, ప్రజల పాల్గొనదలచే ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా చేస్తుంది. అలాగే, విశాఖపట్నంలో పర్యాటకాన్ని మరింతగా పేంచడం కూడా ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. మొత్తంగా విశాఖకు గ్లోబల్ గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వం వ్యూహాలు సిద్ధం చేసుకుంది. దీంతో ఇక్కడ పర్యాటకం పెరగడం, పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

68
ప్రధాని మోడీ కోసం ప్రత్యేక వేదిక
Image Credit : Getty

ప్రధాని మోడీ కోసం ప్రత్యేక వేదిక

జూన్ 17న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆర్కే బీచ్ ప్రాంతాన్ని పరిశీలించి, ప్రధాన వేదికను తనిఖీ చేశారు. ప్రధాని కోసం ఏర్పాటు చేస్తున్న వేదిక నిర్మాణాన్ని సమీక్షించిన తరువాత, ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, ఏర్పాట్లపై కీలక సూచనలు చేశారు. వీటిలో భద్రత, పారిశుధ్యం, రవాణా నిర్వహణ కీలకాంశాలుగా ఉన్నాయి.

ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేస్తోంది. వాటిలో

• 607 అర్బన్ సెక్రటేరియట్లు పాల్గొనే వ్యక్తులతో సమన్వయం చేస్తున్నారు

• 3.5 లక్షల యోగా మ్యాట్లు, 5 లక్షల టీ-షర్టులు పంపిణీ చేయనున్నారు

• మౌలిక సదుపాయాలు: తాత్కాలిక మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, తాగునీరు

• పరీక్షా యోగా సెషన్: జూన్ 20న మాక్ సెషన్ ద్వారా ఏర్పాట్లను తనిఖీ చేస్తారు

నివాసితులు, పర్యాటకుల కోసం నమోదు విధానం

ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) వెబ్‌సైట్ లేదా భాగస్వామ్య యోగా సెంటర్లలో నమోదు చేసుకోవచ్చు. ముందస్తుగా నమోదు చేసుకుంటే, యోగా మ్యాట్, స్థలం లభించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

78
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు?
Image Credit : Getty

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014లో సెప్టెంబర్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 69వ సెషన్‌లో యోగా ప్రాముఖ్యతను వివరించి, దీనికి ప్రత్యేక దినోత్సవం ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రధాని మోడీ సూచనకు 177 దేశాలు మద్దతు ఇచ్చాయి. డిసెంబర్ 11, 2014న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇది యునైటెడ్ నేషన్స్ చరిత్రలో అత్యంత వేగంగా ఆమోదించిన రిజల్యూషన్‌లలో ఒకటిగా నిలిచింది.

జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదు. ఇది ఉత్తరాయణ ప్రారంభ దినంగా ప్రసిద్ధి. సూర్యుడి గరిష్ఠ స్థితిని సూచించే ఈ రోజు, ఉత్తరార్థ గోళంలో సంవత్సరం అతి పొడవైన దినంగా పరిగణిస్తారు. హిందూ తత్వశాస్త్రంలో, ఈ కాలం ఆధ్యాత్మిక ప్రగతికి అనుకూలమైన సమయంగా భావిస్తారని నిపుణులు పేర్కొంటున్నారు.

88
యోగాతో ప్రయోజనాలు చాలానే ఉన్నాయి
Image Credit : Getty

యోగాతో ప్రయోజనాలు చాలానే ఉన్నాయి

యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు. ఇది ఒక జీవనశైలి. శరీరానికే కాకుండా మనస్సు, ఆత్మకి కూడా శ్రేయస్సును అందిస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు. యోగా గురువులు చెబుతున్న వివరాల ప్రకారం..

  •  శరీరంలో కదలికలు, వివిధ భంగిమలతో మెరుగవుతాయి
  •  కండరాలు బలపడతాయి
  •  ఇమ్యూనిటీ, మెటబాలిజం పెరుగుతాయి
  •  85 శాతం మందిలో స్ట్రెస్ తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి
  •  90% మందికి ఆరోగ్యం మెరుగుపడిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి
  • హార్ట్ హెల్త్ మెరుగవుతుంది
  • స్ట్రెస్, ఆందోళన తగ్గుతుంది
  • మెదడు పనితీరు మెరుగవుతుంది

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
నారా చంద్రబాబు నాయుడు
నరేంద్ర మోదీ
విశాఖపట్నం
పవన్ కళ్యాణ్
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved