MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • మొంథా తుపాను తీరందాటుతోంది.. మీరు ప్రయాణాల్లో ఉంటే వెంటనే ఈ పనిచేయండి

మొంథా తుపాను తీరందాటుతోంది.. మీరు ప్రయాణాల్లో ఉంటే వెంటనే ఈ పనిచేయండి

Cyclone Montha : మొంథా సైక్లోన్ మరికొద్దిగంటల్లో తీరం దాటబోతోంది. దీంతో ప్రజలు ఇళ్ళలోనే ఉండాలని.. అత్యవసరం అయితేతప్ప బయటకు రావద్దని సూచిస్తోంది ప్రభుత్వం. మరి ఇప్పటికే వాహనాల్లో రోడ్డుపై ఉన్నవారు ఏం చేయాలంటే..

2 Min read
Author : Arun Kumar P
| Updated : Oct 28 2025, 06:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇక రోడ్డు మార్గాలు కూడా బంద్...
Image Credit : X

ఇక రోడ్డు మార్గాలు కూడా బంద్...

Cyclone Montha : ఆంధ్ర ప్రదేశ్ లో మొంథా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే తుపాను ప్రభావిత జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి... రాత్రికి తీరందాటే సమయంలో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. దీంతో అప్రమత్తమైన రైల్వే, విమానయాన శాఖల అధికారులు ఏపీలో సర్వీసులను రద్దుచేశాయి. ఇప్పుడు రోడ్డు మార్గాలను కూడా మూసేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

26
మరికొద్దిగంటల్లో తీరం దాటనున్న తుపాను
Image Credit : X/@Indiametdept

మరికొద్దిగంటల్లో తీరం దాటనున్న తుపాను

మొంథా తుపాను మరికొద్ది గంటల్లో తీరం దాటనుంది... ఈ నేపథ్యంలో హైవేలపై రాకపోకలను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. ఈదురుగాలులతో కూడిన వర్షాల కారణంగా ప్రమాదాలు జరక్కుండా నివారించేందుకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో రహదారులపై అక్టోబర్ 28 రాత్రి 8.30 గంటలనుండి భారీ వాహనాలను నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కాబట్టి వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ఏదైనా సురక్షిత ప్రాంతంలో వాహనాన్ని నిలుపుకోవాలని సూచించారు.

Related Articles

Related image1
మొంథా తుపాను అలర్ట్: కల్లోలంగా తీర ప్రాంతాలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Related image2
దూసుకొస్తున్న మొంథా తుపాను .. వర్ష బీభత్సం.. బయటకు రావొద్దు
36
ఈ రాత్రి రోడ్లపైకి రాకండి
Image Credit : Getty

ఈ రాత్రి రోడ్లపైకి రాకండి

భారీ వాహనాలే కాదు చిన్నవాహనాలను కూడా రోడ్లపైకి అనుమతించబోమని అధికారులు తెలిపారు. అత్యవసరం అయితేతప్ప ఈ రాత్రి ప్రయాణాలు చేయవద్దని సూచించారు. వర్ష సమయంలో కాలినడకన కూడా బయటకు రావద్దని... ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసర ప్రయాణాలు చేయాల్సివస్తే వాగులువంకలు, పెద్దపెద్ద చెట్లు లేని మార్గాలను ఎంచుకోవాలని... నీటిప్రవాహాలను దాటే ప్రయత్నం అస్సలు చేయరాదని సూచిస్తున్నారు.

46
ఈ జిల్లాల్లోని హైవేలపై ఆంక్షలు
Image Credit : ANI

ఈ జిల్లాల్లోని హైవేలపై ఆంక్షలు

తుపాను ప్రభావిత జిల్లాల్లో హైవేలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు ప్రకటించారు. ఇలా కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో అధికంగా ఉంటుందని ఆర్టిజిఎస్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడు జిల్లాలలో ఈరోజు రాత్రి 8:30 నుంచి రేపు (అక్టోబర్ 29, బుధవారం) ఉదయం 6 గంటల వరకు వాహనాలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆయా జిల్లాలనుంచి వెళ్లే జాతీయ రహదారులు సహా అన్ని రకాల రహదారులపై ట్రాఫిక్ ను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించింది. అయితే అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లేవారికి మాత్రం మినహాయింపు ఇవ్వాలని సూచించింది.

56
రైళ్లు, విమాన సర్వీసులు రద్దు
Image Credit : Asianet News

రైళ్లు, విమాన సర్వీసులు రద్దు

బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో గత శనివారం(అక్టోబర్ 25) నుండి వర్షాలు మొదలయ్యాయి. అయితే వాయుగుండం తుపాను, తీవ్ర తుపానుగా మారాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు తుపాను తీరం దాటబోతోంది... దీంతో వర్ష తీవ్రతే కాదు ఈదురుగాలులు కూడా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలోనే ఏపీకి రైలు, విమాన సర్వీసులను రద్దుచేశారు. విశాఖపట్నం విమానాశ్రయాన్ని మూసివేశారు... అంటే ఇక్కడినుండి నడిచే అన్ని సర్వీసులను రద్దు చేశారు. ఇక విజయవాడ నుండి నడిచే ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు.

66
ప్రస్తుతం మొంథా తుపాను ఎక్కడుంది?
Image Credit : X/APSDMA

ప్రస్తుతం మొంథా తుపాను ఎక్కడుంది?

నిన్న(సోమవారం) తుపానుగా బలపడి... ఇవాళ(మంగళవారం) ఉదయం తీవ్ర తుపాను ఏర్పడింది. ఇది ముందుకు కదులుతూ ప్రస్తుతం కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరానికి దగ్గరయ్యింది. ప్రస్తుతం మచిలీపట్నంకి 60 కిమీ, కాకినాడకి 140 కిమీ, విశాఖపట్నంకి 240 కిమీ దూరంలో కేంద్రీకృతమయ్యింది. గడిచిన 6 గంటల్లో ఇది 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది... దీన్నిబట్టి మరో నాలుగైదు గంటల్లో తుపాను తీరందాటే అవకాశాలున్నాయి. ఈ మొంథా తుపాను తీరందాటే సమయంలో గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి...కాబట్టి తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్ధ సూచిస్తోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
విశాఖపట్నం
విజయవాడ
ఏషియానెట్ న్యూస్
తిరుపతి
అమరావతి
వాతావరణం

Latest Videos
Recommended Stories
Recommended image1
వెంక‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. ముంద‌స్తు బుకింగ్ లేకుండానే ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌నం, నేరుగా టికెట్‌
Recommended image2
తిరుమల లడ్డూను చెక్ చేసేందుకు 'ఇ-నోస్' ఇ-టంగ్'.. ఎలా పనిచేస్తాయో తెలుసా..?
Recommended image3
IMD Rain Alert : అల్పపీడనానికి తోడైన ఉపరితల ద్రోణి.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే
Related Stories
Recommended image1
మొంథా తుపాను అలర్ట్: కల్లోలంగా తీర ప్రాంతాలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Recommended image2
దూసుకొస్తున్న మొంథా తుపాను .. వర్ష బీభత్సం.. బయటకు రావొద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved