Jobs: లక్కీ ఛాన్స్, రూ. 60 వేల జీతంతో ప్రభుత్వ ఉద్యోగం.. ఎవరు అర్హులంటే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నియోజకర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఉద్యోగాల నియామకం చేపడుతోంది. యంగ్ ప్రొఫెషనల్ పేరుతో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారు? అర్హత ఏంటి లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Govt Jobs
స్వర్ణాంధ్ర విజన్ @2047 కింద ప్రతి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి యాక్షన్ ప్లాన్ (CVAP) తయారీ, అమలుకు సహాయపడటమే ఈ యంగ్ ప్రొఫెషనల్స్ ముఖ్య విధి. పీ4 (ప్రజలు - ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యం) సమన్వయకుడిగా కూడా పనిచేస్తారు. ప్రజలు, ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ సంస్థల మధ్య సమన్వయం చేయాల్సి ఉంటుంది.
ప్రణాళిక, అమలు:
* నియోజకవర్గ అభివృద్ధి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి.
* ఈ ప్రణాళికను స్వర్ణాంధ్ర 2047 దృష్టితో కలిపి అమలు చేయాలి.
* ముఖ్యమైన ప్రభుత్వ పథకాలు, అంశాల ఆధారంగా ప్రోగ్రామ్స్ ప్రారంభించాలి.
job
పీ4 భాగస్వామ్యం సమన్వయం:
* ప్రైవేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజంతో కలసి పని చేయాలి.
* ఈ భాగస్వామ్యాల వివరాలు లాగ్బుక్లో నమోదు చేసి, ఫలితాలు పిరియాడికల్గా రిపోర్ట్ చేయాలి.
డేటా ఆధారిత పాలనకు మద్దతు:
* నియోజకవర్గ స్థాయిలో మౌలిక వసతులు, సేవల లోపాలు, ఆర్థిక, సామాజిక వివరాలతో ప్రొఫైల్ సిద్ధం చేయాలి.
* ముఖ్య ప్రదర్శన సూచికలు (KPIs) పర్యవేక్షించాలి.
* అవసరమైన పథకాలపై పాలకుల కోసం నివేదికలు తయారు చేయాలి.
* రాష్ట్ర సాంకేతిక బృందంతో కలిసి పని చేయాలి.
ప్రజా భాగస్వామ్యం & పరిపాలన:
* MLAలు, జిల్లా అధికారులు, NGOలు, విద్యా సంస్థలు, ప్రజలతో కలిసి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి.
* గ్రామ సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలి.
* అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలి.
job
ప్రాజెక్టుల అమలు & సాంకేతిక వినియోగం:
* వ్యవసాయం, మత్స్యశాఖ, MSMEs, విద్య, టూరిజం, రోడ్లు, శుభ్రత, డిజిటల్ సేవలపై ప్రాజెక్టులను అమలు చేయడంలో సహాయం చేయాలి.
* కొత్త సాంకేతికతను ఉపయోగించి సేవల నాణ్యత పెంచాలి.
పర్యవేక్షణ & మూల్యాంకనం:
* KPIs ఆధారంగా నియోజకవర్గ పురోగతిని మానిటర్ చేయాలి.
* ప్రతి నెలా నివేదికలను పంపాలి.
* అడ్డంకులు ఎదురైతే పరిష్కార మార్గాలు సూచించాలి.
శిక్షణ:
* GSWS టీమ్లకు మార్గదర్శకత్వం ఇవ్వాలి.
* శిక్షణలు, ఉత్తమ విధానాలపై విజిట్లు నిర్వహించాలి.
* ఇతర నియోజకవర్గాలతో నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి.
ఇతర బాధ్యతలు:
* నియోజకవర్గ నోడల్ అధికారులు లేదా ప్లానింగ్ శాఖ అప్పగించే ఇతర పనులు కూడా నిర్వర్తించాలి.
జీతం, అర్హతలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
ఈ పోస్టుకు ఎంపికైన వారికి పన్నులతో సహా కలుపుకొని నెలకు రూ. 60,000 జీతం అందిస్తారు. అర్హత విషయానికొస్తే పోస్టు ఆధారంగా సంబంధిత విభాగంలో ఎంబీఏ/పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నోటిఫికేషన్ వెలువడిన తేదీ నాటికి 40 ఏళ్ల లోపు ఉండాలి. 2025 మే 13 దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.