MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Andhra Pradesh
  • ఏపీలో 3 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు ఇవే

ఏపీలో 3 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు ఇవే

Andhra Pradesh New Districts: ఆంధ్రప్రదేశ్ లో మూడు కొత్త జిల్లాలు, ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. పరిపాలనను ప్రజలకు చేరువ చేసే కీలక నిర్ణయంగా దీనిని ప్రభుత్వం పేర్కొంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 25 2025, 06:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పరిపాలనా సంస్కరణల్లో ఏపీకి కొత్త దిశ.. : సీఎం చంద్రబాబు
Image Credit : our own

పరిపాలనా సంస్కరణల్లో ఏపీకి కొత్త దిశ.. : సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మారుస్తూ, ప్రజలకు ప్రభుత్వ సేవలను దగ్గర చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక ముందడుగు వేశారు. సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో, జిల్లాల పునర్విభజన, రెవెన్యూ పరిపాలన పునర్‌వ్యవస్థీకరణపై మంత్రుల కమిటీ సమర్పించిన నివేదిక  పై కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు కొత్త జిల్లాల ఏర్పాటు, ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లకు సీఎం అధికారిక ఆమోదం ప్రకటించారు.

ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి పెరగనుంది. ఇదంతా ప్రజల నుంచి వచ్చిన సూచనలు, స్థానిక అవసరాలు, పెద్దఎత్తున జరిగిన అధికార యంత్రాంగ పరిశీలన ఆధారంగా తీసుకున్న నిర్ణయంగా ప్రభుత్వం పేర్కొంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మార్కాపురం, మదనపల్లె, పోలవరం: కొత్త జిల్లాలు ఇవే
Image Credit : X/AndhraPradeshCM

మార్కాపురం, మదనపల్లె, పోలవరం: కొత్త జిల్లాలు ఇవే

కొత్త జిల్లాల అవసరంపై గత కొన్ని నెలలుగా ప్రజాప్రతినిధులు, స్థానిక సంఘాలు చేసిన విజ్ఞప్తులను పరిశీలించారు. ఆ అధ్యయనం తర్వాత ప్రభుత్వం మూడు ముఖ్య ప్రాంతాలను కొత్త జిల్లాలుగా ప్రకటించింది. వాటిలో

• మార్కాపురం జిల్లా

• మదనపల్లె జిల్లా

• పోలవరం జిల్లా (రంపచోడవరం కేంద్రంగా)

ముఖ్యంగా పోలవరం ప్రాంతంలో గిరిజన జనాభా అధికంగా ఉండడం, ముంపు ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధిని వేగవంతం చేయడం, అడవి ప్రాంతాల్లో సేవలను మరింత పెంచడం ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు కారణమైంది. రంపచోడవరం జిల్లా కేంద్రంగా నిర్ణయించడం ద్వారా గిరిజన ప్రాంతాలకు పరిపాలన మరింత చేరువ అవుతుందని అధికారులు అంటున్నారు.

Related Articles

Related image1
ప్రతి కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డు.. ఏంటిది? ప్రయోజనాలు ఏమిటి?
Related image2
బద్ధలైన ఇథియోపియా అగ్నిపర్వతం: భారత్ పై ఎఫెక్ట్ ఎందుకు? విమానయాన సంస్థలు అలర్ట్‌
34
ఐదు కొత్త రెవెన్యూ డివిజనలు.. పరిపాలనలో మరో బలమైన అడుగు
Image Credit : Chandrababu Twitter

ఐదు కొత్త రెవెన్యూ డివిజనలు.. పరిపాలనలో మరో బలమైన అడుగు

జిల్లాలతో పాటు రెవెన్యూ వ్యవస్థలోనూ విస్తరణ అవసరమని మంత్రుల కమిటీ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు ప్రకటించారు. వాటిలో

• నక్కపల్లి – అనకాపల్లి జిల్లా

• అద్దంకి – ప్రకాశం జిల్లా

• పీలేరు – మదనపల్లె కొత్త జిల్లా

• బనగానపల్లె – నంద్యాల జిల్లా

• మడకశిర – శ్రీ సత్యసాయి జిల్లా

ఈ డివిజన్లు ఏర్పడడంతో ప్రజా సమస్యలు వేగంగా పరిష్కారం కావడం, సేవలు సమయానికి చేరడం, స్థానిక పరిపాలన బలోపేతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

44
కొత్త మండలాలు, పరిపాలనా పునర్వ్యవస్థీకరణ
Image Credit : CM Chandrababu Twitter

కొత్త మండలాలు, పరిపాలనా పునర్వ్యవస్థీకరణ

సమీక్షలో భాగంగా మండలాల పునర్వ్యవస్థీకరణ పై కూడా నిర్ణయాలు తీసుకున్నారు. కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని విభజించి పెద్దహరివనం కొత్త మండలంగా ప్రకటించారు. స్థానిక ప్రజలు చాలాకాలంగా ఈ డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి పనులు కేంద్రీకృతం కావాలనే ప్రధాన కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మొత్తం మీద, ఈ మార్పులతో పరిపాలన మరింత సులభంగా, వేగంగా, గ్రామీణ ప్రజలకు చేరువగా మారే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరలోనే అధికారిక గెజిట్ విడుదల చేసి, కొత్త జిల్లాల కార్యాలయాల ఏర్పాటు, సిబ్బంది నియామకాలు ప్రారంభించనున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
నారా చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
మా ఆరడుగుల బుల్లెట్..! : Home Minister Anitha POWERFUL Speech | CM Chandrababu | Asianet News Telugu
Recommended image2
కొండ‌ల‌ను చీల్చి గోదావ‌రిని తీసుకొచ్చిన ఇంజ‌నీరింగ్ అద్భుతం.. పోల‌వ‌రం ఎడ‌మ కాలువ నిర్మాణం
Recommended image3
Pawan Kalyan : కల్యాణ్ కుమార్ పేరు కాస్త పవన్ కల్యాణ్ గా ఎలా మారింది? అసలు ఈ పేరు పెట్టిందెవరు?
Related Stories
Recommended image1
ప్రతి కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డు.. ఏంటిది? ప్రయోజనాలు ఏమిటి?
Recommended image2
బద్ధలైన ఇథియోపియా అగ్నిపర్వతం: భారత్ పై ఎఫెక్ట్ ఎందుకు? విమానయాన సంస్థలు అలర్ట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved