భారత్ లో ఐఫోన్ పెత్తనం ఇక టాటాలదే!

 ఐఫోన్, టాటా గ్రూప్.. ఈ రెండింటికీ ఇండియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇకనుంచి ఐఫోన్ పెత్తనం టాటాల చేతికి రానుంది. టాటా ఎలక్ట్రానిక్స్, కర్ణాటకలోని నరసాపురంలో ఉన్న పెగాట్రాన్  తయారీ ప్లాంట్‌లో 60% వాటాను కొనుగోలు చేసింది. ఇది భారతదేశంలో టాటా  రెండవ ఐఫోన్ తయారీ ప్లాంట్. ఈ చర్య టాటా ఎలక్ట్రానిక్స్ తయారీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. దీంతో కొత్తగా 5,00,000 ఉద్యోగాలు వస్తాయి.  సెమీకండక్టర్ సాంకేతిక  విస్తరించనుంది.

Tata Acquires 60 Percent Stake in Second iPhone Manufacturing Plant in India

భారతీయ ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లో తన ఉనికిని విస్తరించుకునేందుకు టాటా గ్రూప్ అనుబంధ టాటా ఎలక్ట్రానిక్స్ మరో అడుగు ముందుకు వేసింది. చెన్నైలోని పెగాట్రాన్ టెక్నాలజీ ఇండియా కంపెనీలో 60% వాటాను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు కంపెనీకి భారతదేశంలో రెండవ ఐఫోన్ తయారీ ప్లాంట్‌. దీంతొ  ఎలక్ట్రానిక్స్ రంగంలో టాటా స్థానం మరింత బలోపేతం కానుంది.

పెగాట్రాన్ టెక్నాలజీ,  తైవాన్‌కు చెందిన పెగాట్రాన్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ.  కర్ణాటకలోని నరసాపురంలో ఒక కర్మాగారాన్ని నిర్వహిస్తోంది. కాంట్రాక్టు ప్రాతిపదికన యాపిల్ సంస్థకు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఈ కర్మాగారంలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడం ద్వారా, టాటా ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు యాపిల్ కోసం ఐఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారు చేస్తూ  కొత్త వ్యాపార అవకాశాలకు మార్గం సుగమం చేసుకోనుంది. 

ఈ ఒప్పందం ఆర్థిక వివరాలు వెల్లడించనప్పటికీ, భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో టాటా  ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. భారతదేశంలో AI, డిజిటల్ మరియు సాంకేతికత-ప్రారంభించబడిన తయారీలో పురోగతిని నడిపించాలనే కంపెనీ దృష్టికి అనుగుణంగా, దేశీయ మరియు అంతర్జాతీయ క్లయింట్‌లకు అధిక-నాణ్యత తయారీ సేవలను అందించడానికి ఈ కొత్త కొనుగోలును ఉపయోగించుకోవాలని టాటా ఎలక్ట్రానిక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. 

టాటా ఎలక్ట్రానిక్స్ CEO, మేనేజింగ్ డైరెక్టర్ రణ్ ధీర్ ఠాకూర్ మాట్లాడుతూ ఈ ఒప్పందంతో కొత్త ఆవిష్కరణల శకం మొదలైందన్నారు.  “పెగాట్రాన్ టెక్నాలజీతో మా భాగస్వామ్యంతో, మేము భారతదేశంలో AI, డిజిటల్ మరియు సాంకేతికత-ప్రారంభించబడిన తయారీ యొక్క కొత్త యుగాన్ని ప్రారంభిస్తున్నాము. ఉద్యోగ సృష్టి టాటా ప్రధానం లక్ష్యం. ఈ అడుగు దేశంలోని ఎలక్ట్రానిక్స్ తయారీని బలోపేతం చేస్తుంది. సంస్థ విస్తరణలో భాగంగా, టాటా ఎలక్ట్రానిక్స్ గుజరాత్‌లోని ధోలేరాలో ₹91,000 కోట్ల పెట్టుబడితో భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్ తయారీ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తోంది. అదనంగా, అస్సాంలోని జగిరోడ్‌లో సెమీకండక్టర్ చిప్‌లను అసెంబ్లింగ్ చేయడానికి మరియు పరీక్షించడానికి ₹27,000 కోట్ల పెట్టుబడిని కంపెనీ ప్రకటించింది. వీటితో భారతదేశంలో అనేక ఉద్యోగ అవకాశాలను సృష్టించే అవకాశం ఉంది. టాటా సన్స్ ఛైర్మన్ N. చంద్రశేఖరన్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు బ్యాటరీ-సంబంధిత పరిశ్రమలు వంటి రంగాలలో వచ్చే ఐదు సంవత్సరాలలో 5,00,000 ఉద్యోగాలను సృష్టించాలని చెబుతున్నారు’ అని తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios