Asianet News TeluguAsianet News Telugu

ఐస్ క్రీమ్, గూలాబ్ జామ్ కలిపి తింటున్నారా..? ఏమౌతుందో తెలుసా..?

మనం కామన్ గా తినే కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావట. అవేంటో చూద్దాం..

From ice cream gulab jamun to milk - fruit never eat these foods together ram
Author
First Published Jul 1, 2024, 4:35 PM IST

మనలో చాలా మంది ఫుడ్ లవర్స్ ఉండి ఉంటారు. కొందరికి కొన్ని రకాల ఫుడ్స్ ని నార్మల్ గా తినడం కంటే... వాటిని మరో ఫుడ్ తో కలిపి తీసుకోవడాన్ని ఇష్టపడతారు.  కానీ... అన్ని ఫుడ్ కాంబినేషన్స్ ఆరోగ్యానికి మంచిది కాదు. కొన్ని కాంబినేషన్ ల ఫుడ్ తినడం వల్ల.. ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి.  మరి కొన్నిసార్లు ఆ ఫుడ్ లోని పోషకాలు మన శరీరానికి చేరుకోవు.  మనం కామన్ గా తినే కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావట. అవేంటో చూద్దాం..


1.పాలు, పండ్లు... చాలా మంది ఈ కాంబినేషన్ తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఉపవాసం చేసే సమయంలో భోజనం చేయకుండా పాలు, పండ్లు తీసుకుంటారు.  కానీ ఈ రెండింటి కాంబినేషన్ అస్సలు మంచిది కాదట.  జీర్ణ సమస్యలు రావడానికి కారణం అవుతుందంట. ఆయుర్వేదం ప్రకారం.. ఈ రెండు కలిపి తినడం వల్ల... కడుపులో  చాలా అసౌకర్యంగా ఉంటుంది.

2.పాలక్, పన్నీర్..

పాలక్ (పాలకూర) , పనీర్ (ఇండియన్ చీజ్) రెండూ పోషకమైన ఆహారాలు అయినప్పటికీ, వాటిని కలిపి తినడం మంచిది కాదు.  చాలా మంది ఇష్టంగా తినే ఫుడ్ ఇది. కానీ ఈ కాంబినేషన్ కూడా మంచిది కాదట. పనీర్‌లోని కాల్షియం ,  పాలకూరలోని ఐరన్  గ్రహించడంలో జోక్యం చేసుకోవచ్చు. అందువల్ల, ఇది ఆహారం  మొత్తం పోషక ప్రయోజనాలను తగ్గిస్తుంది.

3. తేనె , వేడి నీరు:
ఉదయం లేవగానే వందకు పది మంది ఈ వాటర్ వాటర్, తేనే కలిపి తీసుకుంటారు. కానీ  ఈ రెండూ కలిపి తీసుకోవడం కూడా మంచిది కాదు. తేనెను వేడి చేయడం వల్ల దాని ప్రయోజనకరమైన ఎంజైమ్‌లు , యాంటీఆక్సిడెంట్‌లు నాశనం అవుతాయి, పోషకాలు క్షీణిస్తాయి.  ఆయుర్వేదం ప్రకారం, చాలా వేడి నీటిలో తేనె కలిపి తాగడం వల్ల హానికరమైన సమ్మేళనాలు ఏర్పడతాయి. తేనె దాని ఆరోగ్య ప్రయోజనాలను కాపాడుకోవడానికి గోరువెచ్చని లేదా గది ఉష్ణోగ్రత నీటిలో తేనెను తీసుకోవడం సాధారణంగా సిఫార్సు చేస్తారు.

4. ఖర్జూరం , పాలు:

పాలు , ఖర్జూరం వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలకు కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని జోడించడం వల్ల కాల్షియం  ఐరన్ గ్రహించకుండా చేస్తుంది. పాలలోని కాల్షియం ఖర్జూరం నుండి ఐరన్  గ్రహించే శరీర సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తుంది. ఇది ఆహారం నుండి మొత్తం ఐరన్  శోషణను తగ్గిస్తుంది. ముఖ్యంగా, రక్తహీనత ఉన్నట్లయితే,అస్సలు తినకూడదు. ఎప్పుడైనా పొరపాటున తీసుకుంటే పర్లేదు కానీ.. రెగ్యులర్ గా అస్సలు తీసుకోకూడదు.

5. ఐస్ క్రీం మరియు గులాబ్ జామూన్: వేడి , చల్లని ఆహారాలు కలిపి తినకూడదు. మీరు వేడి ఆహారాన్ని తిన్నప్పుడు, మీ శరీరం జీర్ణక్రియకు  వేడిని బయటకు పంపడానికి కడుపుకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. దీనికి విరుద్ధంగా, చల్లని ఆహారాలు జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. కడుపులో రక్తనాళాల సంకోచానికి కారణమవుతాయి. ఈ కలయిక ఉబ్బరం, గ్యాస్ లేదా అసౌకర్యానికి దారితీస్తుంది.

6. ఆహారంతో టీ:

టీలో టానిన్ , కెఫిన్ వంటి యాంటీ న్యూట్రీషియన్స్ ఉంటాయి. ఇది శరీరంలో ఐరన్ , కాల్షియం శోషణను నిరోధిస్తుంది. కాబట్టి, అల్పాహారం లేదా చిరుతిండితో టీ తీసుకోకండి.

7. పాలు,చేప:

ఆయుర్వేదం ప్రకారం పాలు, చేపలు కలిపి తినకూడదు. ఈ కలయిక జీర్ణక్రియను కష్టతరం చేస్తుంది. ఇది శరీరంలో హానికరమైన టాక్సిన్స్‌ను కూడా సృష్టిస్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios