సాయిధరమ్ తేజ్, వి.వి.వినాయక్ కాంబినేషన్ లో కొత్త చిత్రం సాయిధరమ్ తేజ్ కి జంటగా నటిస్తున్న లావణ్య త్రిపాఠి షూటింగ్ ప్రారంభమైన సాయిధరమ్ తేజ్ నూతన చిత్రం 

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ సెప్టెంబర్‌ 22న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. 

ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ ఇప్పటివరకు ఒక యాక్షన్‌ సీన్, కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించామన్నారు. సాయిధరమ్‌ తేజ్‌కి ఇది ఓ సెన్సేషనల్‌ మూవీ అవుతుందని.. కచ్చితంగా సూపర్‌హిట్‌ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, ప్రియదర్శి, నల్లవేణు, భద్రం, వెంకీ, రాహుల్‌ రామకృష్ణ, నాజర్‌, జె.పి., రాహుల్‌దేవ్‌, దేవ్‌గిల్‌, ఆకుల శివ, ఆశిష్‌ విద్యార్థి, పవిత్ర లోకేష్‌, కాశీ విశ్వనాథ్‌, బ్రహ్మానందం, తాగుబోతు రమేష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

ఈ చిత్రానికి కథ, మాటలు: శివ ఆకుల, సినిమాటోగ్రఫీ: విశ్వేశ్వర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, మేకప్‌: బాషా, కాస్ట్యూమ్స్‌: వాసు, స్టిల్స్‌: శ్రీను, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌: జి.జి.కె.రాజు, సతీష్‌ కొప్పినీడి, ఫైట్‌మాస్టర్‌: వెంకట్‌, కో-డైరెక్టర్స్‌: సూర్యదేవర ప్రభాకర్‌నాగ్‌, పుల్లారావు కొప్పినీడి, కో-ప్రొడ్యూసర్స్‌: సి.వి.రావు, పత్సా నాగరాజ, నిర్మాత: సి.కళ్యాణ్‌, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వి.వి.వినాయక్‌ అందిస్తున్నారు.