దళపతి విజయ్‌ ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌ చెప్పారు నిర్మాత ఏఎం రత్నం. విజయ్ హిట్ సినిమాలు `ఖుషి`, `శివకాశీ` రీ రిలీజ్ కాబోతున్నాయట.

పాత హిట్ సినిమాలను డిజిటల్ టెక్నాలజీతో డిజిటల్‌లో కన్వర్ట్ చేసి 4కే రిజల్యూషన్‌తో సినిమాలు రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్. అంతేకాదు పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. 

విజయ్ ‘గిల్లి’ కూడా గత ఏడాది రీ రిలీజ్ అయ్యి బాగానే ఆడింది. రీ రిలీజ్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘గిల్లి’ నిలిచింది. తమిళనాడులో ఫస్ట్, ఇండియాలో సెకండ్ ప్లేస్ దక్కించుకుంది.

ఇప్పుడు విజయ్ ‘సచిన్’ కూడా రీ రిలీజ్ అయ్యింది. ఫర్వాలేదనిపించింది. ఈ క్రమంలో విజయ్ హీరోగా వచ్చిన ఇతర హిట్ సినిమాలను కూడా రీ రిలీజ్ చేయాలని నిర్మాతలు  భావిస్తున్నారు.  2000 లో విజయ్, జ్యోతిక నటించిన ‘ఖుషీ’ని రీ-రిలీజ్ చేయాలని నిర్మాత ఏ.ఎం.రత్నం అనుకుంటున్నట్టు తెలిసింది.

అటు 2005 లో విజయ్, అసిన్ నటించిన ‘శివకాసి’ని కూడా డిజిటల్ గా మెరుగుపరిచి రీ-రిలీజ్ చేస్తామని ఏ.ఎం.రత్నం ప్రకటించారు. దీంతో దళపతి విజయ్‌ ఫ్యాన్స్ ఫుల్‌ఖుషీ అవుతున్నారు. విజయ్ ప్రస్తుతం `జన నాయకన్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇది వచ్చే సంక్రాంతికి విడుల కానుంది.