టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్, పవన్ కళ్యాణ్ తో విరాటపర్వం దర్శకుడి సినిమా..?
టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయినట్టు తెలుస్తోంది. విరాటపర్వంతో హిట్ అందుకున్న దర్శకుడు వేణు ఉడుగుల పవర్ స్టార్ కు కథ చెప్పాడట. మరి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?
రీసెంట్ గా విరాటపర్వం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు యంగ్ డైరెక్టర్ వేణు ఊడుగుల . దాదాపు మూడేళు రిలీజ్ కోసం వెయిట్ చేసిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ న్యూస్ ఒకటి చెక్కర్లు కొడుతోంది. వేణూ ఊడుగుల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నాడంటూ వార్త హల్ చెల్ చేస్తోంది. విరాటపర్వం మూవీ రిలీజ్ కు ముందే.. వేణు పవన్ కల్యాణ్కు ఓ కథ వినిపించాడని, సినిమాకు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడని టాక్ గట్టిగా నడుస్తోంది.
అయితే కలెక్షన్ల విషయంలో విరాట పర్వం కొంత వెనుకపడిందని ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ అవుతుంది. అటువంటి టైమ్ లోవేణూతో సినిమా నిజంగానే పవర్ స్టార్ ఒప్పుకున్నారా అనే అనుమానాలు బయటకు వస్తున్నాయి. కానీ పవన్ కల్యాణ్కు ఒకసారి సినిమా నచ్చిందంటే చాలు. కలెక్షన్లతో సంబంధం లేకుండా సినిమా చేస్తాడన్న టాక్ కూడా ఇప్పటికే ఉంది. అయితే ఇపుడున్న పరిస్థితులను చూస్తుంటే.. ఈ సినిమా నిజంగా కన్ ఫార్మ్ అయినా.. ఇప్పట్లోమాత్రం పట్టాలెక్కే ఛాన్స్ దాదాపు కనిపించడంలేదు. ఎందుకంటే.. పవర్ స్టార్ పవన్ బాగా బిజీ కాబోతున్నారు.
ఇప్పటికే పవన్ చేతిలో.. దాదాపు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇవి పూర్తి చేయడానికి పవన్ కు టైమ్ దొరకడంలేదు. జనసేన అధినేత అయిన పవన్ కల్యాణ్ మరోవైపు అక్టోబర్ నుంచి పొలిటికల్ టూర్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో క్రిష్ తో చేస్తున్న హరిహరవీరమల్లు , హరీష్ శంకర్ డైరెక్షన్లో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి.
మరోవైపు సముద్రఖనితో చేయబోయే వినోధయ సీతమ్ తెలుగు రీమేక్ ప్రాజెక్టు కూడా చేయాల్సి ఉంది. పొలిటికల్ ప్లాన్ షురూ అయ్యేందుకు ఇంకా మూడు నెలల సమయమే ఉంది. పవన్ ఈ ప్రాజెక్టులనే అనుకున్న సమయానికి పూర్తి చేస్తాడా..? అన్న డిస్కషన్స్ కూడా హాట్ టాపిక్గా మారిపోయాయి. అంటే ప్రస్తుతానికి లైన్లో పెట్టిన సినిమాలు తప్పించి పవర్ స్టార్ మరో సినిమాను చేసే పరిస్థితులు దరిదాపున కూడా కనిపించడం లేదు.
ఎలా చూసుకున్నా ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో పవన్వేణు కాంబినేషన్లో సినిమా ఎక్స్ పెక్ట్ చేయకపోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్టు ఇన్సైడ్ టాక్. ఇపుడు కాకున్నా పొలిటికల్ షెడ్యూల్ పూర్తయిన తర్వాతైనా ఈ ప్రాజెక్టుకు మోక్షం లభిస్తుందా..? అనేది చూడాలి.