'వీర భోగ వసంతరాయలు' ప్రీమియర్లు రెండురోజులు ముందుగానే!
నారా రోహిత్, సుదీర్ బాబు, శ్రియా శరన్, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న 'వీర భోగ వసంతరాయలు' సినిమా అక్టోబర్ 26న విడుదలకి సిద్ధంగా ఉంది.
నారా రోహిత్, సుదీర్ బాబు, శ్రియా శరన్, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న 'వీర భోగ వసంతరాయలు' సినిమా అక్టోబర్ 26న విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను ఫ్లైహై సినిమాస్ వారు దక్కించుకున్నారు.
ఇటీవలే ఈ సంస్థ 'దేవదాస్' సినిమాని ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సాధారణంగా ఏ సినిమా ప్రీమియర్ అయినా.. ఒకరోజు ముందుగా ఓవర్సీస్ లో విడుదలవుతుంది.
కానీ 'వీర భోగ వసంతరాయలు' సినిమా మాత్రం రెండు రోజులు ముందుగా అక్టోబర్ 23న ప్రీమియర్ షోను ప్రదర్శించనున్నారు. క్రైమ్ నేపధ్యంలో సాగనున్న ఈ సినిమాని దర్శకుడు ఇంద్రసేన రూపొందిస్తున్నాడు. అప్పారావు బెల్లాన నిర్మాత. ఇటీవలే ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ల లుక్స్ ని విడుదల చేసింది చిత్రబృందం. వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కింది.
ఇవి కూడా చదవండి..
రామెజిఫిల్మ్ సిటి లో సుధీర్బాబు పాత్రతో ప్రారంభమైన 'వీర భోగ వసంత రాయలు' షూటింగ్
గుండు,టాటూలు కాదు.. సింపుల్ లుక్ తో ఆకట్టుకున్నాడు!