Asianet News TeluguAsianet News Telugu

సుచీలీక్స్ దెబ్బ తర్వాత త్రిషకు ఏమైంది..కోలుకున్నట్టేనా..

  • సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన సుచీలీక్స్ వ్యవహారం
  • అందరికంటే ఎక్కువ ప్రభావం త్రిషపైనే
  • రెండు వారాల తర్వాత కోలుకున్న త్రిష
trisha back again to social media after suchi leaks

సుచి లీక్స్ వ్యవహారంతో గత కొంత కాలంగా కోలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు ఎంతగా కుదేలయ్యారో తెలిసిందే. ఇప్పుడిప్పుడే సుచీలీక్స్ బాధితులు కోలుకుంటున్నారు. అందులో త్రిష కూడా ఉందనే విషయం తెలిసిందే. ఈ చెన్నై చిన్నది సుచీలీక్స్ లీకేజీల తర్వాత మాత్రం సోషల్ మీడియాకు పూర్తిగా దూరమైంది. దాదాపు 2 వారాల పాటు ఎలాంటి అప్ డేట్స్, పిక్స్ పెట్టకుండా పూర్తిగా ఫ్యాన్స్ కు దూరమైపోయింది. ఎట్టకేలకు ఈ చెన్నై బ్యూటీ ట్విట్టర్ లో మళ్లీ హంగామా షురూ చేసింది. నిన్నటికి నిన్న తన గ్లామరస్ లుక్ ను పోస్ట్ చేసిన ఈ భామ.. తాజాగా మలేషియాలోని తన ఫ్రెండ్స్ తో దిగిన మరో ఫొటోను కూడా షేర్ చేసింది. 

 

నిజానికి ఇంకొన్నాళ్ల పాటు ఈ సోషల్ మీడియా వ్యవహారాలకు దూరంగా ఉండాలనుకుంది త్రిష. కాకపోతే.. ఆమె ఆరోగ్యం బాగాలేదంటూ ఒక్కసారిగా పుకార్లు గుప్పుమన్నాయి. హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్ లో జాయిన్ చేశారంటూ ప్రచారం జరిగింది. అలాంటిదేం లేదంటూ త్రిష తల్లి వివరణ ఇచ్చినప్పటికీ రూమర్లు మాత్రం ఆగలేదు. దీంతో మరోసారి సోషల్ మీడియాలోకి రాక తప్పలేదు త్రిషకు.

 

ప్రస్తుతం అరవింద్ స్వామితో ఓ సినిమా చేస్తున్న త్రిష. తెలుగు-తమిళ భాషల్లో త్వరలోనే ఓ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీలో కూడా నటించేందుకు రెడీ అవుతోంది. రేపోమాపో మలేషియా నుంచి చెన్నైకి రానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios