హీరోయిన్ శ్వేత బసు పెళ్లి: వరుడు ఎవరో తెలుసా?
తన వివాహం విషయంలో షికారు చేస్తున్న పుకార్లకు హీరోయిన్ శ్వేతబసు సమాధానం ఇచ్చారు
ముంబై: తన వివాహం విషయంలో షికారు చేస్తున్న పుకార్లకు హీరోయిన్ శ్వేతబసు సమాధానం ఇచ్చారు. కొత్త బంగారు లోకం ద్వారా ఆమె తెలుగు తెరకు పరిచయమయ్యారు. ప్రస్తుతం గ్యాంగ్ స్టార్ వెబ్ సిరీస్ ద్వారా సందడి చేస్తున్నారు. తన పెళ్లి ఉహాగానాలపై ఆమె ఈ సందర్భంగా స్పందించారు.
బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్తో గత నాలుగేళ్లుగా స్నేహం చేస్తున్నారు. అతన్నే వివాహం చేసుకోబోతున్నట్లు ఆమె చెప్పారు. అబ్బాయిలే పెళ్లి ప్రస్తావన తెచ్చే రోజులు ఎప్పుడో పోయాయని, ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిలతో ప్రేమను వ్యక్తం పరుస్తున్నారని చెప్పారు.
"నేను రోహిత్కు గోవాలో ప్రపోజ్ చేశాను. ఆ తర్వాత అతను పుణెలో నా ప్రేమను అంగీకరించాడు. ఇద్దరి ఇంట్లో అంగీకారం తెలిపారు. అయితే పెళ్లికి ఇప్పుడే తొందరేం లేదు" అన్నారు.
"మా ఇద్దరి నిశ్చితార్థం జరిగినట్లు వస్తున్నవార్తాకథనాలు వాస్తవమే. కానీ, మా ఇద్దరి జీవితాలకు సంబంధించిన విషయాలు బయటికి చెప్పుకోవాలని అనుకోవడం లేదు" ఆమె అన్నారు.
బాలీవుడ్లో ఇక్బాల్ చిత్రంతో బాలనటిగా కెరీర్ను ప్రారంభించిన శ్వేత.. కొత్త బంగారు లోకంతో తెలుగువారికి చేరువయ్యారు. తర్వాత కళావర్ కింగ్, రైడ్, కాస్కో తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం కాబోయే భర్తతో రూపొందిస్తున్న కొన్ని షార్ట్ ఫిలింస్లో, మరికొన్ని వెబ్ సిరీస్లతోపాటు బాలీవుడ్లోనూ ఓ పొలిటికల్ చిత్రంలోనూ నటిస్తున్నారు.