ఈ రోజుల్లో పతివ్రతల్ని ఎక్స్‌పెక్ట్ చేయకండి : శ్రీరెడ్డి

టాలీవుడ్ ఫైర్ బ్రాండ్.. వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా క్యాస్టింగ్ కౌచ్‌పై గళం విప్పుతున్న శ్రీరెడ్డిని మీడియా పక్కన పెట్టేయడంతో ఇక లాభం లేదనుకుని మంగళవారం నాడు ఫేస్‌బుల్ లైవ్‌లోకి వచ్చింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నా ఉద్యమం ఆగలేదు. నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చా.. దైవదర్శనం వల్ల నాలో మరింత పవర్ పెరిగింది. అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే.. వారికి లం*** అని ముద్రవేస్తున్నారు. కాల్ గర్ల్ అంటూ నోటికొచ్చినట్లు వాగుతున్నారు. అయితే బయటకు కనిపించేది మేమే.. ఎంత మంది ఇండస్ట్రీలో అలాంటి వాళ్లు లేరు. అలాంటి పరిస్థితులు రావడానికి కారణం కామంతో కళ్లు మూసుకుపోయే మీలాంటి వాళ్లు కాదా? మీరు మాత్రం ఎన్ని అడ్డదారులైనా తొక్కొచ్చు. ఆడవాళ్లు మాత్రం పతీవ్రతల్లేనే ఉండాలి. ఈ రోజుల్లో పతీవ్రతల్ని ఎక్స్‌పెక్ట్ చేయకండి. మీ లాంటి ఎదవల వల్లే పతీవ్రతలు అనే వాళ్లు కనుమరుగు అవుతున్నారు. మీరు చూసే కామపు చూపుల వల్లే అమ్మయిలు పతీవ్రతలు కాలేకపోతున్నారు" అంటూ ఫేస్ బుక్ లైవ్ లో చెప్పుకొచ్చింది.