నేచురల్ స్టార్ నానికి సారి చెప్పారు స్టార్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్ జే సూర్య. నానికి సారి చెప్పాల్సిన అవసరం ఏమోచ్చింది. ఎస్ జే సూర్య ఎందుకు ఆ పని చేశారో తెలుసా.?

తమిళ నటుడు, దర్శకుడు ఎస్.జె. సూర్య తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్నారు. నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం సినిమాలో విలన్ పాత్రలో తనదైన శైలిలో నటించిన సూర్యకు, ఈ పాత్రకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు (ఉత్తమ సహాయ నటుడు)ను ప్రకటించింది. ఈ సందర్భంగా నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా సూర్యకు అభినందనలు తెలియజేశారు.

నాని తన ట్వీట్‌లో, “కంగ్రాట్స్ సర్. మీరు ఈ సినిమాకి కేవలం సహాయ నటుడు మాత్రమే కాదు. మీరు అన్నీ. ఈ అవార్డుకు మీరు అన్ని విధాలా అర్హులు” అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే, వేరే సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్న ఎస్.జె. సూర్య అప్పట్లో కేవలం, “చాలా ధన్యవాదాలు నేచురల్ స్టార్ నాని గారు” అని మాత్రమే స్పందించారు.

ఇక ఆ తర్వాత తను కంప్లీట్ గా స్పందించలేదని భావించిన ఎస్.జె. సూర్య, శనివారం ఎక్స్ (X) వేదికగా నానీకి క్షమాపణలు చెపుతూ ఓ నోట్‌ను రిలీజ్ చేశారు. షేర్ అందుల్ ఆయన ఏమన్నారంటే.. “ప్రియమైన నేచురల్ స్టార్ నాని గారికి..

క్షమించండి. షూటింగ్ మధ్యలో ఉండటం వల్ల మీ అభినందనలపై సరిగా స్పందించలేకపోయాను. మీకు కేవలం 'థాంక్యూ సర్' అని చెప్పడం సరికాదని నాకు తెలుసు. మీరు, దర్శకుడు వివేక్ గారు మద్దతుగా లేకపోతే ఈ ప్రయాణం సాధ్యమయ్యేది కాదు. మీరు తెరపై మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా హీరో. మీ అభినందనలకు, మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు.” అని రాశారు సూర్య. ఆయన చేసిన ఈ పనికి సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

సరిపోదా శనివారం సినిమా 2024 ఆగస్టు 29న విడుదలై, భారీ విజయాన్ని సాధించింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నాని హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్ గా, సాయికుమార్, మురళీ శర్మ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. ఇందులో ఎస్ జే సూర్య పోషించిన అవినీతిపరుడైన పోలీస్ అధికారి “దయా” పాత్ర ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు, రాష్ట్ర స్థాయిలో ప్రతిష్ఠాత్మక అవార్డు కూడా ఈ పాత్రకు లభించడం మరో విశేషం.