కాబోయే కోడలు నాగార్జునను అంత మాటంటుందా..
- గత డిసెంబర్ లోనే అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, శ్రియా భూపాల్ నిశ్చితార్థం
- ఇటలీలోని రోమ్ లో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకునేందుకు నిర్ణయం
- ఫ్లైట్ టికెట్స్ రద్దు చేసుకోవాలని బంధు మిత్రులకు సూచించిన కుటుంబాలు
- ఎయిర్ పోర్ట్ లో గొడవ సందర్భంగా శ్రియా భూపాల్ నోరు జారటం వల్లనే కథ మొదటికి
- ఇంతకీ శ్రియా భూపాల్ ఏం నోరు జారింది.. ఎందుకు అఖిల్ వివాహం రద్దయింది
అక్కినేని అఖిల్, శ్రీయ భూపాల్ల పెళ్లి రద్దయిందన్న వార్త గత రెండ్రోజులుగా ఇండస్ట్రీ సర్కిల్స్ లోనే కేక హైదరాబాద్ ఏలీట్ జనాలు, తెలుగు ప్రజలకు సంచలన వార్త. మీడియాలో ఈ వార్త కేవలం నిన్నటి నుంచే వచ్చినప్పటికీ.. ఇద్దరి మధ్య బ్రేకప్ ఎప్పుడో జరిగిపోయిందని సమాచారం.
చిన్న ఏజ్ (22 ఏళ్లు)లోనే ఉన్న అఖిల్, వయసులో పెద్దయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని అఖిల్కు నాగ్ ఎంతగానో నచ్చ చెప్పాడట. చైతన్య కూడా వారించాడట. అయినప్పటికీ అఖిల్ వినకపోవడంతో సరేనని చెప్పేసిందట అక్కినేని కుటుంబం. అయితే.. తీరా నిశ్చితార్థం జరిగాక ఇక పెళ్లే తరువాయి అనుకున్న తరుణంలో... అంతా షాక్ కు గురయ్యే పిడుగు లాంటి వార్త. అఖిల్ వివాహం రద్దు వార్త అక్కినేని అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.
అయితే ఈ వివాహం రద్దు కావడానికి అఖిల్, శ్రీయల మధ్య హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో జరిగిన గొడవే కారణమని తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఎయిర్ పోర్ట్ లో పెద్ద గొడవే జరిగినట్టు తెలుస్తోంది. రోమ్లో పెళ్లి ఏర్పాట్లు చేసేందుకు నెల రోజుల క్రితం ఇరు కుటుంబ సభ్యులు బయల్దేరారట. అక్కడే గొడవ మొదలై అది అంతా కూల్ గా జరుగుతున్న వేళ ఒక్కసారిగా పెను తుఫానుగా మారిందట.
ఎయిర్పోర్ట్లోనే అఖిల్, శ్రీయల మధ్య విభేదాలు తలెత్తాయట. అక్కడే బహిరంగంగా వాదనకు దిగారాట. ఇరువురి మధ్య ఘర్షణ ఎంతకూ తగ్గకపోగా తీవ్ర స్థాయికి చేరిందట. మీడియా ప్రతినిధులు ఫోటోలకు ఫోజులిమ్మని అడగ్గా... అఖిల్ అందుకు శ్రియను సంసిద్ధం చేసేందుకు రెడీ అయ్యాడట. శ్రియను ఫోటోలకు ఫోజులు ఇమ్మని అడగ్గా... ఆమె నిరాకరించిందట. అఖిల్ ఎంతగా ప్రయత్నించినా.. వినని శ్రియ మరింత స్వరం పెంచిందట. ఎయిర్ పోర్ట్ లో అంతా చూస్తుండగాీనే శ్రియ స్వరం పెంచడం గమనించిన నాగార్జున వారించబోయారట. అయితే శ్రియ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా... నాగార్జునపై అనవసరమైన మాటలు వదిలిందట.
గొడవ జరక్కుంండా..సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన నాగార్జునను... రెండు పెళ్లిల్లు చేసుకున్న నువ్వు ఏం చెప్తున్నావు అని అనేసిందట శ్రియ. దీంతో ఒక్కసారి షాక్ కు గురైన నాగ్, అమల, అఖిల్ అండ్ ఫ్యామిలీ రోమ్ ప్రయాణం రద్దు చేసుకున్నారట.
గొడవ అనంతరం శ్రీయను, ఆమె తల్లిని అక్కడే వదిలేసి, గుడ్బై చెప్పేసి అక్కినేని అఖిల్ తరువాత గోవాకు వెళ్లిపోయారని తెలిసింది. అఖిల్ వెళ్లి పోతున్నా... వారిద్దరూ అఖిల్ను, కుటుంబ సభ్యులను వారించే ప్రయత్నం కూడా చేయలేదట. దీంతో చేసిది లేక నాగ్ సైలెంట్ అయిపోయాడని సమాచారం. ఏర్ పోర్ట్ లో జరిగిన ఘటనను గురించి పరిశీలిస్తే... ఇద్దరూ మళ్లీ కలిసే ఛాన్సెస్ అస్సలు లేవనే సమాచారం వస్తోంది.