ఎక్కువ పారితోషికం అడిగినందుకు శ్రద్ధా కపూర్ని ఏక్తా కపూర్ సినిమా నుండి తప్పించారనే వార్తలు వస్తున్నాయి. దర్శకుడు ఈ వార్తలపై స్పందించారు. ఆయన ఏం చెప్పాడంటే
'స్త్రీ 2' ఫేమ్, ప్రభాస్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, ఏక్తా కపూర్తో కలిసి ఓ థ్రిల్లర్ సినిమా చేయాల్సి ఉంది. కానీ, ఆమెను సినిమా నుండి తప్పించారనే వార్తలు వస్తున్నాయి. శ్రద్ధా అడిగిన పారితోషికం ఏక్తా కపూర్కి ఎక్కువైందని, దాంతో ఆమె స్థానంలో వేరే హీరోయిన్ కోసం వెతుకుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై దర్శకుడు రాహీ అనిల్ బర్వే స్పందించారు. శ్రద్ధా కపూర్ సినిమా నుండి బయటకు వెళ్లిందనే వార్తను ఆయన ఖండించనూ లేదు, ధ్రువీకరించనూ లేదు.
సినిమా నుండి శ్రద్ధా కపూర్ బయటకు వెళ్లడంపై దర్శకుడు ఏమన్నారు
రాహీ అనిల్ బర్వే బాంబే టైమ్స్తో మాట్లాడుతూ, "ఇవన్నీ గాలి వార్తలే. ప్రస్తుతం నేను 'రక్త బ్రహ్మాండ్' పూర్తి చేసి, తర్వాతి సినిమాపై దృష్టి పెడుతున్నాను. అంతే." అని అన్నారు.
శ్రద్ధా కపూర్ ఎంత పారితోషికం అడిగారు?
బాలీవుడ్ హంగామా ఒక నివేదికలో, శ్రద్ధా కపూర్ 17 కోట్ల రూపాయల పారితోషికంతో పాటు లాభాల్లో వాటా అడిగినట్లు పేర్కొంది. ఆమె డిమాండ్ నెరవేరితే, దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలుస్తారు.
అయితే, ఏక్తా కపూర్కి శ్రద్ధా అడిగిన పారితోషికం చాలా ఎక్కువ అనిపించి, సినిమా బడ్జెట్ దెబ్బతింటుందని భావించి, వేరే నటి కోసం వెతుకుతున్నట్లు కూడా అదే నివేదికలో పేర్కొన్నారు. చిత్ర బృందం చాలా మంది స్టార్ హీరోయిన్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఏక్తా కపూర్ థ్రిల్లర్ సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు
శ్రద్ధా కపూర్ని తప్పించారనే వార్తను ఆమె కానీ, ఏక్తా కపూర్ బృందం కానీ ధ్రువీకరించలేదు. మరోవైపు, దర్శకుడు రాహీ అనిల్ బర్వే తన తదుపరి వెబ్ సిరీస్ 'రక్త బ్రహ్మాండ్' పై పనిచేస్తున్నారు. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, సమంత రూత్ ప్రభు, వామికా గబ్బీ, అలీ ఫజల్ నటిస్తున్నారు. ఈ సిరీస్ షూటింగ్ వచ్చే నెలలో ముంబైలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆయన ఏక్తా కపూర్ సినిమాపై పనిచేస్తారు.
శ్రద్ధా కపూర్ ఇతర ప్రాజెక్టుల గురించి
శ్రద్ధా కపూర్ ప్రస్తుతం 'స్త్రీ 3'లో నటిస్తున్నారు. ఈ సినిమా 2027లో విడుదల కానుంది. దినేష్ విజాన్, భూషణ్ కుమార్, బోనీ కపూర్లతో కలిసి మరికొన్ని ప్రాజెక్టులపై చర్చలు జరుపుతున్నారు.