Asianet News TeluguAsianet News Telugu

కౌశల్ ది పెయిడ్ ఆర్మీ.. ప్రముఖ మీడియా కథనం!

బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ కౌశల్ కి ప్రేక్షకుల్లో ఎంతటి ఫాలోయింగ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడి కారణంగానే బిగ్ బాస్ టీఆర్ఫీ రేటింగులు కూడా భారీగా వస్తున్నాయని టాక్. 

shocking news on kaushal army
Author
Hyderabad, First Published Sep 19, 2018, 12:05 PM IST

బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ కౌశల్ కి ప్రేక్షకుల్లో ఎంతటి ఫాలోయింగ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడి కారణంగానే బిగ్ బాస్ టీఆర్ఫీ రేటింగులు కూడా భారీగా వస్తున్నాయని టాక్. హౌస్ మేట్స్ తో ఎలాంటి రిలేషన్స్ పెట్టుకోకుండా తన గేమ్ ప్లాన్ తో ముందుకు వెళ్తోన్న కౌశల్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. అతడి కోసం కౌశల్ ఆర్మీ కూడా ఉంది.

అయితే ఇదంతా పెయిడ్ ఆర్మీ అనే వారు కూడా చాలా మంది ఉన్నారు. తాజాగా ఓ ప్రముఖ మీడియా సంస్థ కౌశల్ ఆర్మీ గురించి రాసిన కథనంలో కౌశల్ ఆర్మీ ఎక్కువశాతం మంది డబ్బు కోసమే పని చేస్తున్నారంటూ పేర్కొంది. అసలు విషయంలోకి వస్తే కౌశల్ కోసం హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

విజయవాడలో జరిగిన కౌశల్ ఆర్మీ ర్యాలీకి సంబందించిన వార్తలను బయటపెడుతూ వచ్చిన వార్తలు షాకింగ్ గా మారాయి. కౌశల్ పై కథనం రాసిన మీడియా సంస్థ కౌశల్ బొమ్మ ఉన్న టీ షర్ట్ తో వచ్చిన ఒక యువకుడిని.. ఏ విషయంలో కౌశల్ ని అభిమానిస్తున్నారని ప్రశ్నించింది. దానికి సమాధానంగా సదరు వ్యక్తి.. తన బండిలో వచ్చేప్పుడు రూ.200 లతో పెట్రోల్ కొట్టించారని, వెళ్లేప్పుడు మరో రూ.200 కొట్టిస్తామని చెప్పడంతో వచ్చానని బదులిచ్చాడు.

అతడు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అంతేకాదు ఈ వ్యవహారం మొత్తం ప్రసాద్ అనే వ్యక్తి చేయిస్తున్నట్లు వెల్లడించాడట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. అయితే కౌశల్ క్రేజ్ చూసి తట్టుకోలేక ఇలా చేస్తున్నారని కౌశల్ అభిమానులు ఈ వార్తలను కొట్టిపడేస్తున్నారు. కౌశల్ యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయం మరింత మందికి చేరాలంటూ షేర్ చేస్తున్నారు.  

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్ 2: హౌస్ మేట్స్ ని కుక్కలని తిట్టిన కౌశల్..

బిగ్ బాస్2: కౌశల్, తనీష్ ఒకరినొకరు తన్నుకునేంతగా..

నానిపై కౌశల్ ఆర్మీ పోలీస్ కేసు పెట్టనున్నారా..?

Follow Us:
Download App:
  • android
  • ios