Asianet News TeluguAsianet News Telugu

బ్రహ్మీ ప్రోగ్రామ్ లో కౌశల్ పై సెటైర్లు!

బిగ్ బాస్ షో పూర్తయిన తరువాత స్టార్ మాస్ యాజమాన్యం 'ది గ్రేట్ తెలుగు లాఫ్టర్ ఛాలెంజ్' అనే ప్రోగ్రామ్ ని టెలికాస్ట్ చేస్తోంది. బ్రహ్మానందం జడ్జిగా వ్యవహరిస్తోన్న ఈ షోకి బిగ్ బాస్ ఫేమ్ తేజస్వి యాంకర్ గా  కనిపిస్తోంది. స్టాండప్ కామెడీ కాన్సెప్ట్ తో డిజైన్ చేసిన ఈ షోకి ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రావడం లేదు. 

setairs on kaushal
Author
Hyderabad, First Published Nov 16, 2018, 12:35 PM IST

బిగ్ బాస్ షో పూర్తయిన తరువాత స్టార్ మాస్ యాజమాన్యం 'ది గ్రేట్ తెలుగు లాఫ్టర్ ఛాలెంజ్' అనే ప్రోగ్రామ్ ని టెలికాస్ట్ చేస్తోంది. బ్రహ్మానందం జడ్జిగా వ్యవహరిస్తోన్న ఈ షోకి బిగ్ బాస్ ఫేమ్ తేజస్వి యాంకర్ గా కనిపిస్తోంది. స్టాండప్ కామెడీ కాన్సెప్ట్ తో డిజైన్ చేసిన ఈ షోకి ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రావడం లేదు.

మధ్యమధ్యలో బ్రహ్మానందం నాన్ వెజ్ కి అలవాటు పడ్డ వారు వెజ్ కి అలవాటు పడడానికి టైమ్ పడుతుందంటూ కామెడీ విషయంలో జబర్దస్త్ వంటి షోలను విమర్శించి మాట్లాడారు. ఈసారి ఈ కామెడీ షోలో బిగ్ బాస్ విన్నర్ కౌశల్ పై సెటర్లు వేశారు.

ఓ స్టాండప్ కమెడియన్.. ''ఈరోజు షో విన్నర్ సంపూర్నేష్ బాబు.. అందరి దగ్గర కంటెంట్ ఉంది.. సంపూ దగ్గర ఆర్మీ ఉంది'' అనే వ్యాఖ్యలు చేయగానే యాంకర్ తేజస్వి పడిపడి నవ్వేస్తుంది. ఈ కామెంట్స్ పరోక్షంగా కౌశల్ ని ఉద్దేశించి చేసినవి స్పష్టంగా తెలుస్తోంది.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఎంతమంది కంటెస్టెంట్స్ ఉన్నా.. కౌశల్ కి ఆర్మీ ఉండడంతో దానిముందు ఎవరూ నిలవలేకపోయారనే విమర్శలు వినిపించాయి. హౌస్ మేట్స్ లో చాలా మందికి కౌశల్ టైటిల్ గెలవడం ఇష్టం లేదు. కేవలం ఆర్మీ కారణంగా కౌశల్ గెలిచాడనే విమర్శలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.

'జబర్దస్త్'కి బ్రహ్మీ పంచ్..! 

Follow Us:
Download App:
  • android
  • ios