బాలకృష్ణ డైలాగ్ చెబితే ‘కుర్రాళ్లకు అమ్మాయి ప్రపోజ్ చేసినట్టు’గా ఉంటుంది.. సాయి మాధవ్ కామెంట్స్!
‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో విజయవంతంగా కొనసాగుతోంది. వేదికపై ప్రముఖ స్క్రీన్ రైటర్ సాయి మాధవ్ బుర్ర మాట్లాడుతూ బాలకృష్ణ డైలాగ్ డెలివరీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
నందమూరి నటసింహాం బాలకృష్ణ (Balakrishna) నటించిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. మరో ఐదు రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలను మేకర్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఒంగోలు మార్కెట్ రోడ్ లోని అర్జున్ ఇన్ ఫ్రా గ్రౌండ్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. శ్రేయాస్ మీడియా వారు ఈవెంట్ ను ఆర్గ నైజ్ చేస్తున్నారు.
ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా బీ గోపాల్ హాజరయ్యారు. అలాగే స్క్రీన్ రైటర్, డైలాగ్ రచయిత సాయి మాధవ్ బుర్ర (Sai Madhav Burra) హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి మాధవ్ మాట్లాడుతూ బాలయ్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే బాలయ్య డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో తనదైన శైలిలో వర్ణించారు. ‘బాలయ్య డైలాగ్ చెప్పుతుంటే.. కుర్రాళ్లకు ఓ అందమైన అమ్మాయి ఐలవ్ యూ చెప్పినట్టు ఉంటుంది. తనకైతే పెద్ద కూతురికి పెళ్లి కుదిరిన సంబరంలా.. అమ్మాయిలకు నచ్చినవాడు తాళికడుతున్నట్టుగా.. అప్పుడే పుట్టిన బిడ్డకు అమ్మ ముద్దుపెడుతున్నట్టుగా ఉంటుందం’టూ ఆకాశానికి ఎత్తారు. ఇక శ్రుతి హాసన్ కూడా చక్కగా నటించిందన్నారు. తనలో మంచి కామెడీ యాంగిల్ ఉందని తెలిపారు. ఇక సినిమా నటసింహాం వీరసింహారెడ్డి గర్జిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ప్రపంచంలోని బాలయ్య అభిమానులందరికీ నచ్చే సినిమానే కాకుండా అన్నీ వర్గాల వారిని కూడా మెప్పిస్తుందని అభిప్రాయపడ్డారు.
‘అఖండ’ తర్వాత ‘వీరసింహారెడ్డి’ రాబోతుండటంతో సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కి రెడీగా ఉంది. బాలయ్య సరసన గ్లామర్ బ్యూటీ శ్రుతి హాసన్ (Shruti Haasan) నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. జవనరి 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.