రెండు పెళ్లిల్లు, అలానే రెండు రిసెప్షన్లు కూడా.. అదిరిందయ్యా చైతూ..
- హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో ముగిసిన సమంత చైతూల వివాహం
- రిసెప్షన్ ఏర్పాట్లపై అక్కినేని కుటుంబం కసరత్తు
- చెన్నై, హైదరాబాద్ లలో రెండు సార్లు రిసెప్షన్ అని ఇన్ సైడ్ టాక్
నాగచైతన్య- సమంతలు ఇటు హిందూ సంప్రదాయంతోపాటు అటు క్రిస్టియన్ సంప్రదాయంలోనూ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 6, 7 తేదీల్లో వివాహ బంధంతో ఒకటయేందుకు గోవాలో జరిగిన వివాహానికి అక్కినేని, దగ్గుబాటి కుటుంబ సభ్యులలతో పాటు సమంత కుటుంబానికి చెందిన ముఖ్యమైన బంధువులు మొత్తం కలిపి 100 మంది దాకా హాజరయ్యారు. అయితే టాలీవుడ్తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమలతో సంబంధాలు ఉన్న నాగార్జున, సమంతలు రిసిప్షన్ను గ్రాండ్గా నిర్వహించి సినీ, రాజకీయ ప్రముఖులులను ఆహ్వానించనున్నట్టు ఇదివరకే తెలిపారు.
కానీ రిసెప్షన్ కు సంబంధించి ఎటువంటి ముహూర్తాన్ని ఖరారు చేయలేదు. తాజాగా ‘రాజు గారు గది 2’ మూవీలో ప్రమోషన్ ప్రెస్ మీట్లో పాల్గొన్న నాగార్జున, సమంతలను రిసెప్షన్ ఎప్పుడూ అంటే తొందర్లోనే అన్నారు తప్ప క్లారిటీ ఇవ్వలేదు. పైగా నాగార్జున.. సమంత, చైతు లు ఎప్పుడంటే అప్పుడు అంటూ తప్పించుకున్నారు.ముఖ్యంగా నాగార్జున వ్యాఖ్యల నేపథ్యంలో ఇక వీరి రిసెప్షన్ ఉండటం కష్టమే అనుకున్నారంతా.
అయితే సమంత-నాగ చైతన్య రిసెప్షన్కు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ వార్త సినీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే అక్కినేని నాగచైతన్య- సమంతల వివాహం మాదిరిగానే రిసెప్షన్ కూడా రెండుసార్లు జరగబోతున్నట్టు సమాచారం.
ముందుగా సమంత కుటుంబ సభ్యులు చెన్నైలో ఘనంగా ‘సామ్-చై’ రిసెప్షన్ను నిర్వహించేందుకు ఏర్పాట్లలలో నిమగ్నమైనట్టు సమంత సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబ సభ్యులతో దగ్గుబాటి కుటుంబ సభ్యులు హాజరవుతుండగా.. కోలీవుడ్కి చెందిన సినీ ప్రముఖులు హాజరౌతారని తెలుస్తోంది. కాగా ఆ కార్యక్రమం ముగిసిన తరువాత తిరిగి హైదరాబాద్లోని ఇక్కడ అతిథులకోసం గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పెళ్లితో పాటు రిసెప్షన్ కూడా సార్లు చేసుకుని సమంత-నాగచైతన్యల జోడీ కొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టబోతున్నారనుకోవాలి.