Asianet News TeluguAsianet News Telugu

కేవలం నాలుగే రోజులకు రూ.247 కోట్లు

  • టైగర్ జిందాహై మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సల్మాన్ ఖాన్
  • ఈ మూవీలో సల్మాన్ ఖాన్ సరసన హిరోయిన్ గా కత్రినా కైఫ్
  • బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న టైగర్ జిందా హై

 

salman tiger zinda hai collections flow

బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన టైగర్ సల్మాన్ ఖాన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. ‘ట్యూబ్ లైట్’ మూవీతో బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బతిన్న ఈ సూపర్ స్టార్ ఇప్పుడు ‘టైగర్ జిందా హై’తో మళ్లీ తన తన పవర్ చూపిస్తున్నాడు. టైగర్ జిందా హై వసూళ్లతో దూసుకెళ్తోంది. తొలి రెండు రోజుల కంటే మిన్నగా ఆదివారం  ఈ చిత్రం ఏకంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

 

కేవలం విడుదలైన నాలుగు రోజుల వ్యవధిలో ‘టైగర్’ జిందా హై ఇండియా వసూళ్లు రూ.150 కోట్ల మార్కును దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్ర నాలుగు రోజుల వసూళ్లు రూ.247 కావడం విశేషం. తొలి మూడు రోజుల్లో మాదిరే క్రిస్మస్ రోజు కూడా ఈ చిత్రం భారీ వసూళ్లే రాబట్టింది. ఐదో రోజు సెలవు కాకపోయినా వసూళ్లు నిలకడగానే ఉన్నట్లు ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. సల్మాన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టయిన ‘భజరంగి భాయిజాన్’ రూ.626 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత వచ్చిన ‘సుల్తాన్’ కూడా రూ.600 కోట్ల మార్కును అందుకుంది.

 

ఇదే ఊపు కొనసాగితే.. ‘టైగర్ జిందా హై’ కలెక్షన్లు ఈ రెంటినీ దాటేసే అవకాశాలున్నాయి. రెండో వారాంతంలో కూడా సల్మాన్ సినిమా జోరు కొనసాగించే అవకాశముంది. ఇయర్ ఎండింగ్ హంగామాలో భాగంగా ఈ చిత్రానికి మంచి వసూళ్లే రావచ్చు. యశ్ రాజ్ ఫిలిమ్స్ బేనర్లో సల్మాన్ చేసిన ‘ఏక్ థా టైగర్’కు ‘టైగర్ జిందా హై’ సీక్వెల్. తొలి చిత్రాన్ని కబీర్ ఖాన్ రూపొందిస్తే.. రెండో చిత్రాన్ని ‘సుల్తాన్’ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ తీర్చిదిద్దాడు. ఈ చిత్రంలో సల్మాన్ మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ కథానాయికగా నటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios