Asianet News TeluguAsianet News Telugu

ఫ్యాన్స్ సెల్ఫీ అడిగితే.. భోజనం పెట్టించిన మెగా హీరో!

ఫ్యాన్స్ ని ప్రేమించడంలో చిన్న మామయ్య పవన్ ని గుర్తు చేస్తున్నట్లు రుజువు చేశాడు. ఒక సెల్ఫీ అడిగితే వచ్చిన అభిమానులకు ఏకంగా బోజనమే పెట్టించాడు. 

SAI DHARAM TEJ Provided Lunch For All the fans
Author
Hyderabad, First Published Jan 29, 2019, 2:57 PM IST

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యువ సాయి ధరమ్ తేజ్ మరోసారి తన మంచి మనసుతో అందరిని ఆకర్షించాడు. ఫ్యాన్స్ ని ప్రేమించడంలో చిన్న మామయ్య పవన్ ని గుర్తు చేస్తున్నట్లు రుజువు చేశాడు. ఒక సెల్ఫీ అడిగితే వచ్చిన అభిమానులకు ఏకంగా బోజనమే పెట్టించాడు. 

అసలు మ్యాటర్ లోకి వెళితే.. ప్రస్తుతం నేను శైలజా దర్శకుడైన కిషోర్ తీరుమలతో సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అయితే విషయం తెలుసుకున్న అభిమానులు కొంత మంది షూటింగ్ జరుగుతున్న స్టూడియో దగ్గరకు అభిమాన హీరోను కలవాలని వచ్చారు. 

SAI DHARAM TEJ Provided Lunch For All the fans

ఒక్క ఫోటో దిగితే చాలని అనుకున్న యువకుల నీరీక్షణకు సాయి నుంచి తొందరగానే రెస్పాన్స్ వచ్చింది. అయితే షూటింగ్ ఆపేసి ఫ్యాన్స్ ను పిలిపించి ముందుగా వారికి భోజనం పెట్టించాడు. ఆ తరువాత అందరిని కలుసుకొని వారికి సెల్ఫీలు ఇచ్చాడు. హిట్స్ లేకపోయినా ఈ హీరో క్రేజ్ అయితే తగ్గలేదు. అభిమానుల సంఖ్య కూడా తగ్గలేదు. మరి చిత్ర లహరి సినిమాతో సాయి ఎంతవరకు హిట్టందుకుంటాడో చూడాలి. 

asianet news special

షార్ట్ ఫిలిమ్స్ చేసి కష్టపడి పైకొచ్చిన తెలుగు యువ దర్శకులు!

Follow Us:
Download App:
  • android
  • ios