అమెరికాలోని అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకొంటున్న "సాక్ష్యం"

బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీవాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ "సాక్ష్యం" ప్రస్తుతం అమెరికాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. 15 రోజుల షెడ్యూల్ లో అమెరికాలోని సుదరమైన లొకేషన్స్ లో చిత్ర బృందం చిత్రీకరణ జరపనుంది. న్యూయార్క్, గ్రాండ్ కెన్యాన్, న్యూజెర్సీ ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్-పూజా హెగ్డేల నడుమ ఒక సాంగ్ ను కూడా షూట్ చేయనున్నారు. హై టెక్నికల్ వేల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తుండగా.. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.