Asianet News TeluguAsianet News Telugu

ర‌వితేజ `ట‌చ్ చేసి చూడు` షూటింగ్ పూర్తి

  • మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న 'టచ్ చేసి చూడు'
  • ఈ మూవీలో రవితేజ సరసన హిరోయిన్లుగా రాశీఖ‌న్నా, సీర‌త్ క‌పూర్
  • వక్కంతం వంశీ అందించిన ఈ కథకు విక్రమ్ సిరికొండ దర్శకత్వం

 

ravi teja touch chesi chudu shooting finished

మాస్ మహారాజా రవితేజ హీరోగా 'టచ్ చేసి చూడు' పేరుతో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఇటీవలే ఆ సినిమా చిత్రీకరణ  పూర్త‌యింది. .బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన  విక్రమ్ సిరికొండ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. రాశీఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ నాయిక‌లు.

 

నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ మాట్లాడుతూ  "మాకు చిరకాల మిత్రుడైన రవితేజ తో ఈ సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాస్ మహారాజా ఇమేజ్ కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథను తయారు చేశారు. షూటింగ్ పూర్త‌యింది.ప్రస్తుతం రీ రికార్డింగ్ జ‌రుగుతోంది`` అని తెలిపారు. 

 

ఈ చిత్రానికి సంగీతం : జామ్ 8, కథ : వక్కంతం వంశీ, స్క్రీన్ ప్లే : దీపక్ రాజ్, మాటలు : శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి మల్లు,కేశవ్ , ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్: రమణ,  ఛాయాగ్రహణం :  చోటా.కె.నాయుడు,  నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ, స్క్రీన్ ప్లే ,దర్శకత్వం : విక్రమ్ సిరికొండ.

Follow Us:
Download App:
  • android
  • ios