అందంతోనే కాక అభినయంతోనూ టాలీవుడ్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్న రాశిఖన్నా తాజాగా సోషల్ మీడియాలో ఓ పోయెమ్ రాసి పోస్టే చేసిన రాశి మహిళలకు మహిళాదినోత్సవం సందర్భంగా స్పెషల్ వీడియో చేస్తుందట

లేటెస్ట్ గా లీడింగ్ హీరోయిన్స్ లో రాశీఖన్నా కూడా చేరిపోయిందంటే అతిశయోక్తి కాదు. నటనతో పాటు తన అదనపు టాలెంట్స్ ను కూడా అప్పుడప్పుడు ప్రదర్శిస్తుంటుంది రాశి. ఉమెన్స్ డే సందర్భంగా రాశి ఓ బ్యూటీఫుల్ పోయెమ్ రాసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ఇక మార్చి 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు ఓ వీడియోని డెడికేట్ చేయాలని కూడా ప్లాన్ చేస్తోందట.

ప్రస్తుతం రాశీ ఖన్నా పలు సినిమాలతో బిజీగా ఉండగా ఉన్ని కృష్ణన్-మోహన్ లాల్ ప్రాజెక్ట్ తో మలయాళం ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇందులో ఈ బ్యూటీ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తుందట. ఇక తెలుగులో గోపిచంద్ సరసన ఆక్సీజన్ మూవీలో నటించిన రాశి , రవితేజ టచ్ చేసి చూడు, జూనియర్ ఎన్టీఆర్ 27వ చిత్రాలలో కథానాయికగా నటించనుంది. తమిళంలో సైతాన్ కా బచ్చా చిత్రం ఈ అమ్మడికి డెబ్యూ మూవీ కాగా ప్రస్తుతం ఈ చిత్రంతోను బిజీగా ఉంది రాశీ. ఇమైక్క నోడీగల్ అనే మరో తమిళ చిత్రంలో కూడా రాశీ నటిస్తుంది.