రాజీవ్ గాంధీ హత్య కుట్రను ఇన్వెస్టిగేట్ చేయనున్న రానా
- కన్నడలో భారీ చిత్రంలో చేసేందుకు అంగీకరించిన రానా
- రాజీవ్ గాంధీ హత్య కుట్రను ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్ గా రానా
- ఆస్ఫోట-ది హ్యూమన్ బాంబ్ అనే చిత్రంలో సీబీఐ ఆఫీసర్ గా రానా
మామూలగానే మల్టీ లాంగ్వేజీ మూవీకి తగ్గకుండా చేసే దగ్గుబాటి రానా.. ఇక బాహుబలి ఇచ్చిన ఇమేజ్ ను వాడుకోకుండా ఉంటాడా. ప్రస్థుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ అలరిస్తున్న రానా ‘బాహుబలి’తో మలయాళంలోనూ మంచి గుర్తింపు సంపాదించాడు. ఇప్పుడు ఒక్క సినిమాతో నాలుగు భాషలపై గురి పెట్టాడు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యోదంతం ఆధారంగా ‘ఆస్ఫోట-ద హ్యూమన్ బాంబ్’ అనే సినిమా తీయనున్నట్టు కన్నడ దర్శకుడు ఏయమ్మార్ రమేశ్ గతేడాది ప్రకటించారు.
ఇందులో రాజీవ్ హత్య కేసును ఇన్వేస్టిగేషన్ చేసే సీబీఐ ఆఫీసర్ డీఆర్ కార్తికేయన్గా రానా నటించనున్నాడు. రాజీవ్ గాంధీపై జరిగిన ఆత్మాహుతి దాడిలో మరణించడం వెనుక ఎల్టీటీఈ సంస్థ హస్తం ఉందనేది తెలిసిందే. ఈ నిజాలను సీబీఐ ఆఫీసర్ ఎలా వెలుగులోకి తీసుకొచ్చాడు? వాళ్లను ఎలా రౌండప్ చేశాడు? అనే కథతో సినిమా తీస్తారట. ఈ చిత్రాన్ని నాలుగు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
రానా ఇప్పటికే దర్శకుణ్ణి రెండుమూడు సార్లు కలిసి.. కథ, అతని పాత్ర తీరుతెన్నుల గురించి చర్చించారు. ముందు ఈ సినిమాను కన్నడ, తమిళ భాషల్లో తీయాలనుకున్నారు. ఇప్పుడు రానా చేరికతో తెలుగు, హిందీలతో కలిపి నాలుగు భాషల్లో తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘బాహుబలి’ చేసేటప్పుడే ‘నేనే రాజు–నేనే మంత్రి’, తెలుగు–తమిళ సినిమా ‘1945’ అంగీకరించారు.