Asianet News TeluguAsianet News Telugu

కన్నడిగులను రెచ్చగొడుతున్న జక్కన్న రాజమౌళి

  • కావేరీ జల వివాదం సందర్భంగా కన్నడిగులకు వ్యతిరేకంగా సత్యరాజ్
  • బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్
  • క్షమాపణ కోరితేనే బాహుబలి2 రిలీజ్ అవుతుందంటున్న కన్నడ ప్రజా సంఘాలు
  • దీనిపై స్పందిస్తూ కన్నడిగులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించిన రాజమౌళి

 

rajamouli responds to kannadigas agitations against bahubali

‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలకు సంబంధించిన గత కొంత కాలంగా కర్ణాటకలో వివాదం కొనసాగుతోంది. ఎప్పుడో తొమ్మిదేళ్ల కిందట కావేరి జలాల వివాదానికి సంబంధించి కర్ణాటకపై నటుడు సత్యరాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని చూపించి.. ఆయన క్షమాపణ చెబితే తప్ప ‘బాహుబలి-2’ను కర్ణాటకలో విడుదల కానివ్వబోమని పట్టుబట్టుకుని కూర్చున్నాయి కన్నడ ప్రజా సంఘాలు. 


సత్యరాజ్ చేసింది 9 ఏళ్ల నాటి క్రితం వ్యాఖ్యలయినా... ఇప్పుడు వాటిని చూపించి కన్నడిగులు బాహుబలి2 రిలీజ్ ను అడ్డుకోవడానికి చూస్తున్నారు. దీనిపై సత్యరాజ్ కానీ.. బాహుబలి టీం కానీ ఇప్పటిదాకా స్పందించలేదు. కానీ విడుదలకు సమయం దగ్గరపడుతున్నా వివాదం పరిష్కారం కాకపోవడంతో దర్శక ధీరుడు రాజమౌళి నేరుగా రంగంలోకి దిగాడు.



కన్నడిగులను ఎలాగైనా ఒప్పించాలని తెగ ప్రయత్నం చేశాడు జక్కన్న. అందుకే..ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఏదైనా మాట్లాడే హక్కు ఉంటుందని.. ఆ స్వేచ్ఛను అందరూ గౌరవించాలని రాజమౌళి అన్నాడు. సత్యరాజ్ ‘బాహుబలి’ సినిమాలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రమే అని.. ఆయన నిర్మాతో.. దర్శకుడో.. హీరోనో కాదని రాజమౌళి అన్నాడు. సత్యరాజ్ తొమ్మిదేళ్ల కిందట చేసిన వ్యాఖ్యల్ని కారణంగా చూపించి ‘బాహుబలి’ని అడ్డుకోవడం బాధాకరమని రాజమౌళి అన్నాడు. కావేరి జలాల వివాదం తర్వాత ఈ తొమ్మిదేళ్లలో సత్యరాజ్ సినిమాలు కనీసం పాతికైనా విడుదలై ఉంటాయని.. వాటన్నింటినీ వదిలిపెట్టి ‘బాహుబలి’నే లక్ష్యంగా చేసుకోవడం సమంజసం కాదని జక్కన్న చెప్పాడు.

 

అయితే కన్నడ జనాలు ఇవన్నీ పట్టించుకునే స్థితిలో లేరు. అక్కడి రాజకీయ నాయకులు.. కొన్ని సంఘాల నేతలు.. బాహుబలికి ఉన్న హైప్ చూసుకుని.. సత్యరాజ్ వివాదాన్ని తమ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి నిర్ణయించుకున్నాయి. అందుకే అంత పట్టుదలగా ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో వివాదం ఎలా సద్దుమణుగుతుందో.. సినిమా అనుకున్న ప్రకారం కర్ణాటకలో విడుదలవుతుందో లేదో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios