Padamati Sandhyaragam: జీ తెలుగులో ప్రసారమవుతున్న పడమటి సంధ్యారాగం సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. ఆధునిక భావాలను ఇష్టపడని ఒక రఘురాముని కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 22 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

ఎపిసోడ్ ప్రారంభంలో ప్రమిదలు అమర్చమంటున్నావు మళ్లీ నువ్వే ఈ కార్యక్రమం సాగకుండా చూస్తానంటున్నావు ఎలా అంటూ కంగారుగా అడుగుతుంది రామలక్ష్మి. నా మీద నమ్మకం ఉంచి నీ పని నువ్వు చెయ్యు అంటుంది ఆద్య. చారు, రామలక్ష్మి ప్రమిదలు అమర్చి దీపాలు వెలిగిస్తుంటే అవి వెలగవు. అత్తయ్య ఇది నూనె కాదు నీళ్ల లాగా ఉంది అంటుంది చారు. కానీ నేను నూనె పోసాను అంటూ చెక్ చేస్తుంది పద్మ.

ఇది నీళ్లే పానకం లాగా ఉంది అంటుంది. అలా ఎలా పోసేస్తావ్ అంటూ మందలిస్తాడు వెంకట్రావు. నాకేం తెలుసు నూనె చెంబులో నీళ్లు ఉంటాయని అంటూ ప్రమిదల్లో నుంచి నీళ్లు తీసేసి మళ్లీ నూనె పోయడానికి చూస్తుంది పద్మ. ఒక ప్రమిదలో ఉంగరం కనిపిస్తుంది. నేను తెచ్చింది నూనె కావాలని ఎవరో ఇందులో నీళ్లు కలిపారు అప్పుడు వాళ్ళ ఉంగరం పడిపోయింది. కావాలంటే చూడండి అంటూ ఉంగరం చూపిస్తుంది పద్మ.

అప్పుడు తన వేలికి ఉంగరం లేకపోవడం గమనిస్తుంది ఆద్య. ఈ ఉంగరం ఎవరిది అంటూ నిలదీస్తుంది పద్మ. తప్పనిసరి పరిస్థితుల్లో నాదే అని చెప్తుంది ఆద్య. అక్కడున్న వాళ్ళందరూ ఆద్యని నానా మాటలు అంటారు. అంతమంది అన్ని మాటలు అనుకుంటే నువ్వేమీ మాట్లాడవేమీ అంటుంది జానకి. అప్పుడే అక్కడికి వచ్చిన రఘురాం జరిగింది తెలుసుకొని ఎందుకిలా చేసావ్ అంటూ ఆద్య ని నిలదీస్తాడు.

నా కొడుకు చారుని చేసుకోవడం ఇష్టం లేదు అందుకే ఇలా చేసింది అంటుంది పద్మ. శీను వెంటనే తన ఉంగరాన్ని దాచేసి ఆ ఉంగరం నాదే నేనే ఇలా చేశాను అంటాడు. నువ్వెందుకు అలా చేశావు అంటూ నిలదీస్తాడు రఘురాం. నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటూ షాక్ ఇస్తాడు శీను. ఏమన్నావ్ అంటూ కోపంగా శీను మీదికి వెళ్ళబోతాడు రఘురాం. పెళ్లి చేసుకోను అంటే ఇప్పుడు కాదు బావగారు బాగా చదువుకున్నాక అప్పుడు చేసుకుంటాడట నాకు చెప్పాడు అంటూ కొడుకుని వెనకేసుకొస్తాడు వెంకటరావు.

మరి నాకెందుకు చెప్పలేదు అయినా పెళ్లి చేసుకుంటానని చెప్పింది శీను, మాట ఇచ్చింది శీను ఇప్పుడు ఇలా అంటే ఆడపిల్ల తల్లిదండ్రులు ఎంత బాధ పడతారు. రేపే పంతులు గారిని పిలిపించి పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రఘురాం. మరోవైపు రామలక్ష్మి తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పడం, శీను కి కూడా ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పడం గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆద్య.

ఇంతలోనే శీను అక్కడికి వచ్చి ఆద్య కి థాంక్స్ చెప్తాడు. ఎందుకు అంటుంది ఆద్య. నా పెళ్లి ని చెడగొట్టావు కదా అందుకే ఎక్కడ దీపాలు వెలిగిస్తే ఈ పెళ్లి అయిపోతుందో అని కంగారు పడిపోయాను అంటాడు శీను. పైకి నేనంటే ఇష్టం లేదంట కానీ లోపల మాత్రం నేనంటే ఇష్టమే ఒప్పుకో అంటాడు. నేను ఆ పని చేసింది నీ కోసం కాదు రామలక్ష్మి కోసం నువ్వు ఎక్కువ ఊహించుకోకు అంటుంది ఆద్య.

అదేంటి నాకంటే పెళ్లి ఇష్టం లేదు కానీ రామలక్ష్మి కి పెళ్లంటే ఇష్టమే కదా అంటాడు శీను. అప్పుడే అక్కడికి వచ్చిన రామలక్ష్మి నాకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు బాగా చదువుకోవాలి, మంచి హాకీ ప్లేయర్ని అవ్వాలి అందుకే రామలక్ష్మి ఈ పని చేసింది అంటూ ఆద్య ని  హగ్ చేసుకుని ఆద్య దగ్గర బుక్స్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రామలక్ష్మి. పోనీలే ఏదైతేనేమి నా పెళ్ళికి కూడా అపశకునాలు ఎదురవుతున్నాయి. బహుశా మా పెళ్లి జరగడం ఆ దేవునికి కూడా ఇష్టం లేదేమో అంటాడు శీను.

చారుని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు కదా అంటుంది ఆద్య. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అంటాడు శీను. మీ మామయ్య ముహూర్తాలు పెట్టిస్తానన్నారు కదా అప్పుడు ఏం చేస్తావు అంటుంది. ఏదో ఒకటి చేస్తాను కానీ ఈ పెళ్లి మాత్రం జరిగే ప్రసక్తే లేదు. చారు తన నోటితోనే ఈ పెళ్లి వద్దు అనే లాగా చేస్తాను చూస్తూ ఉండు తను రోజురోజుకి నాకు దూరం అవుతూ ఉంటుంది నేను నీ ప్రేమకి దగ్గరవుతూ ఉంటాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు శీను. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.