డ్రైన్ లో పడి మృతి చెందిన  రేడియో మిర్చి ఉద్యోగిని 

ఢిల్లీ సమీపంలోని నోయిడాలో తానియా ఖన్నా అనే మహిళ ఓ డ్రైన్ లో పడి మరణించింది. 26 ఏళ్ళ తానియా..గుర్ గావ్‌లో జరిగిన ఓ మీటింగ్ లో పాల్గొని మంగళవారం రాత్రి 2 గంటల ప్రాంతంలో కారులో ఇంటికి తిరిగి వెళ్తుండగా కారు అదుపు తప్పి లోతైన డ్రైన్ లో పడిపోయింది. ఆమె మృత దేహాన్ని బుధవారం వెలికి తీసినట్టు పోలీసులు తెలిపారు. రేడియో మిర్చి మార్కెటింగ్ టీమ్ లో ఆమె పని చేస్తున్నట్టు తెలిసిందని వారు చెప్పారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred