ఆకాశ్ కోసమే ఈ సినిమా చేస్తున్నా..పూరీ
- పూరీజగన్నాథ్ దర్వకత్వంలో ఆకాశ్ పూరీ కొత్త సినిమా
- ఆకాశ్ కి జోడీగా మంగళూరు భామ నెహాశెట్టి
- ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్ర బృందం
ప్రముఖ దర్శకుడు పూరీజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ మెహబూబా’. పూరీ కుమారుడు ఆకాశ్.. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని చిత్ర బృందం ఈ రోజు విడుదల చేసింది. ఫస్ట్ లుక్లో విమానాలు, రైలు బొమ్మ మధ్య పాకిస్థాన్ అని ఉండడంసినిమాపై ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాలో ఆకాశ్ సరసన మంగళూరుకు చెందిన నెహాశెట్టి నటిస్తోంది.
దీని గురించి పూరీ మాట్లాడుతూ.. తన ఆలోచనలకు భిన్నమైన కథ ఇదని చెప్పారు. సినిమాలపై తన కుమారుడికి ఉన్న ప్రేమ కారణంగానే తాను ఈ సినిమాను అంగీకరించినట్లు తెలిపారు. ఈ సినిమా స్క్రిప్టు అంతా పూర్తి చేసుకున్న తర్వాతే తాను ఎంత అద్భుతమైన ప్రేమకథ తీస్తున్నాన్న విషయం అర్థమైందని చెప్పారు. 1971 భారత్- పాక్ యుద్ధ నేపథ్యంలో ఈ రొమాంటిక్ ప్రేమకథను తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు.
సందీప్ చౌటా సంగీతం అందిస్తుండగా.. పూరీ కనెక్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నటి ఛార్మి ప్రొడక్షన్ బాధ్యతల్ని చూసుకొంటున్నారు.