Prabhas: వరద బాధితుల కోసం ప్రభాస్.. భారీ విరాళం..
సాయం చేయడంలో ప్రభాస్ చేయి ఎప్పుడూ పెద్దగానే ఉంటుంది. ఏ కష్టం వచ్చినా కూడా తాను ఉన్నానంటూ ముందుకొస్తుంటారు ప్రభాస్. గతంలో ఎన్నోసార్లు సాయం చేసారు ప్రభాస్. తాజాగా మరోసారి ఇదే చేసారు.
ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు ముందుంటుంది చిత్ర పరిశ్రమ. అందులో తెలుగు చిత్ర పరిశ్రమ ఓ అడుగు ముందే ఉంటుంది. తాజాగా మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు తారలు. ఏపీ వరల బాధితుల కోసం తమ వంతు విరాళాలు అందిస్తున్నారు. ఏపీలో కురుస్తున్న వర్షాల కారణంగా అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే. చాలా మంది నిరాశ్రయులయ్యారు. అన్నింటిని కోల్పోయారు. ఊహించిన తుఫాన్, వరదలు అక్కడ ప్రజలను, జనజీవనాన్ని అస్థవ్యస్తం చేసింది.
దీంతో ఇప్పటికే స్పందించారు సెలబ్రిటీలు. చిరంజీవి, రామ్చరణ్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ స్పందించారు. తలా రూ.25లక్షల విరాళాలు ప్రకటించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి విరాళంగా అందిస్తున్నట్టు వెల్లడించారు. వీరితోపాటు గీతా ఆర్ట్స్ సంస్థ కూడా స్పందించి పదిలక్షల విరాళం ప్రకటించింది. ఇప్పుడు గ్లోబల్ స్టార్గా రాణిస్తున్న ప్రభాస్(Prabhas) స్పందించారు. తనదైన స్టయిల్లో ఆయన భారీ విరాళం ప్రకటించారు. ఏకంగా రూ.కోటి విరాళంగా ఏపీ సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్టు వెల్లడించారు.
సాయం చేయడంలో Prabhas చేయి ఎప్పుడూ పెద్దగానే ఉంటుంది. ఏ కష్టం వచ్చినా కూడా తాను ఉన్నానంటూ ముందుకొస్తుంటారు ప్రభాస్. గతంలో ఎన్నోసార్లు సాయం చేసారు ప్రభాస్. తాజాగా మరోసారి ఇదే చేసారు. ఆంధ్రప్రదేశ్ను ఈ మధ్య కాలంలో అనుకోని వర్షాలు, వరదలు మంచెత్తిన విషయం తెలిసిందే. ఈ విపత్తు కారణంగా కోట్లాది రూపాయలు నష్టపోయారు ప్రజలు, ప్రభుత్వం. వాళ్లను ఆదుకోడానికి ఏపీ గవర్నమెంట్ కూడా తమదైన సాయం చేస్తున్నారు. మరోవైపు తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతోమంది హీరోలు, నిర్మాతలు సిఎం రిలీఫ్ ఫండ్కు విరాళం అందిస్తున్నారు.
తాజాగా ప్రభాస్ కూడా కోటి రూపాయలు విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో కూడా ప్రభాస్ భారీగానే విరాళాలు అందచేసారు. హైదరాబాద్ వరదల సమయంలో కూడా కోటి రూపాయలు అందించారు. కరోనా సమయంలో ఏకంగా 4.5 కోట్ల విరాళం అందించారు. ఇలా అవసరం అనుకున్న ప్రతీసారి ప్రభాస్ తన గొప్ప మనసు చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా మరోసారి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు రెబల్ స్టార్. ఈయన పెద్ద మనసుకు అభిమానులతో పాటు అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం `రాధేశ్యామ్` చిత్రంలో నటిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రమిది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. పీరియడ్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. జనవరి 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, రెండు పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. వీటితోపాటు `ఆదిపురుష్`, `సలార్` చిత్రాల్లో నటిస్తున్నారు ప్రభాస్.
also read: ఏపీ వరద బాధితుల కోసం కదిలిన టాలీవుడ్.. చిరంజీవి, రామ్చరణ్, మహేష్ విరాళాలు..