- నిన్న ఎమ్ ఎల్ ఏ ఆడియో రిలీజ్ లో పోసాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి
- సాధారణంగా సినిమా ఫంక్షన్లలో విపరీతంగా పొగిడేయటం కనిపిస్తుంది
- తెలుగుదేశం పార్టీ మీది. రామారావుగారి కుటుంబం నుంచి నీలాంటివాడు వస్తే ప్రజలు బాగుపడతారు
నిన్న ఎమ్ ఎల్ ఏ ఆడియో రిలీజ్ లో పోసాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.ముఖం మీదనే తిట్టాలన్నా.. పొగడాలన్నా ఆయన తర్వాతే ఎవరైనా. సాధారణంగా సినిమా ఫంక్షన్లలో విపరీతంగా పొగిడేయటం కనిపిస్తుంది. అంతేకానీ.. హీరోను నువ్వు అది అయిపో.. ఇది అయిపో అనేది దాదాపుగా ఉండదు. కానీ.. పోసాని ఆ అడుగు వేసేశారు. కల్యాణ్ రామ్ ను ఉద్దేశించి చాలా ఎగ్జైటింగ్ గా మాట్లాడిన పోసాని.. కీలక వ్యాఖ్యలు చేశారు.
చాలామంది హీరోలు అవుతారని.. వేల కోట్ల రూపాయిలు సంపాదిస్తారన్నారు. దీనికి హరికృష్ణ.. కల్యాణ్ రామ్ లు భిన్నమన్నారు. అందుకే కల్యాణ్ రామ్ సక్సెస్ కావాలన్నారు. అన్నింటికి మించి రాజకీయంగా కల్యాణ్ రామ్ ఎమ్మెల్యే కావటం తనకు ఇష్టమన్నారు.
ఎందుకా మాట తాను చెబుతున్నానంటే అని చెబుతూ.. తెలుగుదేశం పార్టీ మీది. రామారావుగారి కుటుంబం నుంచి నీలాంటివాడు వస్తే ప్రజలు బాగుపడతారు. సమాజం బాగుపడుతుంది అని వ్యాఖ్యాలు చేశారు. పోసాని మాటలకు కంటిన్యూషన్ గా దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ. పోసాని చెప్పినట్లు కల్యాణ్ రామ్ ఎమ్మెల్యే కావాలని చాలామంది కోరుకుంటారని.. ఆయన మంచి లక్షణాలున్న అబ్బాయి అన్న దానికి చక్కటి ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. చూస్తుంటే.. తెలుగుదేశం పార్టీలో కొత్త సమీకరణాలు తీసుకొచ్చే దిశగా పోసాని తెలిసో.. తెలియకో ఒక మాట అనేశారని చెప్పక తప్పదు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Mar 25, 2018, 11:58 PM IST