త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పూనమ్ కౌర్ చేసిన లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. త్రివిక్రమ్ వివాదం విషయంలో తాను కాంప్రమైజ్ కానని పూనమ్ కౌర్ ఈ పోస్ట్ ద్వారా చెప్పకనే చెబుతోంది. 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం చిత్రం తర్వాత తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. అల్లు అర్జున్ తో మూవీ చేయాల్సి ఉన్నప్పటికీ అది తాత్కాలికంగా వాయిదా పడింది. బన్నీతో త్రివిక్రమ్ భారీ పాన్ ఇండియా చిత్రం చేయాలనుకున్నారు. పురాణాలకు సంబంధించిన కథ కూడా రెడీ చేసుకున్నారు. కానీ ఇంతలో అల్లు అర్జున్.. అట్లీ దర్శకత్వంలోని చిత్రంతో బిజీ అయ్యారు.

పూనమ్ కౌర్, త్రివిక్రమ్ వివాదం

దీంతో త్రివిక్రమ్ తదుపరి చిత్రంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే నటి పూనమ్ కౌర్ విషయంలో త్రివిక్రమ్ వివాదానికి ఫుల్ స్టాప్ పడడం లేదు. తరచుగా పూనమ్ కౌర్ త్రివిక్రమ్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూనే ఉంది. త్రివిక్రమ్ పై సెటైర్లు వేస్తూ విమర్శలు చేస్తూనే ఉంది. తనని త్రివిక్రమ్ అనేక ఇబ్బందులకు గురి చేశారంటూ పలు సందర్భాల్లో పూనమ్ కౌర్ ఆరోపణలు చేసింది. త్రివిక్రమ్ పై ఆమె గతంలో ఫిర్యాదు కూడా చేసింది.

త్రివిక్రమ్ పైనే కంప్లైంట్ చేశా

అయితే ఇంతవరకు ఈ వ్యవహారం ఎటూ తేలలేదు. తాజాగా మరోసారి పూనమ్ కౌర్ ఇంస్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. త్రివిక్రమ్ పై చేసిన కంప్లైంట్ విషయంలో తాను కాంప్రమైజ్ కాలేదు అంటూ పూనమ్ కౌర్ చెప్పకనే చెబుతోంది. ఇంస్టాగ్రామ్ లో పూనమ్ కౌర్ చేసిన పోస్ట్ ఇలా ఉంది. నేను గతంలోనూ చెప్పాను, ఇప్పుడూ చెబుతున్నాను. నేను ఈ మెయిల్ ద్వారా కంప్లైంట్ ఫైల్ చేశాను. దీని గురించి ఝాన్సీ గారితో మాట్లాడినప్పుడు.. మనం మీట్ అవుదామని చెప్పారు. కానీ అది ఆలస్యం అవుతూనే ఉంది. ఝాన్సీ గారిని రిక్వెస్ట్ చేస్తే తనని డిస్టర్బ్ చేయొద్దని కోరారు.

రాజకీయ శక్తులు కాపాడుతున్నాయి

దీంతో కొంతమంది నాపై విమర్శలు చేస్తున్నారు. తాను నేరుగా ఎవరి పేరు ప్రస్తావించకుండా ఇలా కంప్లైంట్స్ చేస్తున్నానంటూ విమర్శిస్తున్నారు. నన్ను విమర్శిస్తున్న వాళ్లకి నేను క్లియర్ గా చెప్తున్నా.. నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ పై కంప్లైంట్ చేశాను. ఆయన్ని కొన్ని రాజకీయ శక్తులు, ఇండస్ట్రీలో ప్రముఖులు కాపాడుతూ వస్తున్నారు. దీని గురించి నేను మహిళా సంఘాలతో కూడా మాట్లాడాను అని పూనమ్ కౌర్ పేర్కొంది.