Asianet News TeluguAsianet News Telugu

కత్తిమహేష్ ను చూసి పరుగు లంకించిన పూనమ్ కౌర్

  • కత్తిమహేష్ ను చూసి పరుగు లంకించిన పూనమ్ కౌర్
poonam kaur runs away to avoid stage sharing with kathi mahesh

పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్‌గా చేసుకొని క్రిటిక్ కత్తి మహేష్ మాటల దాడులు చేయడమనేది మీడియాలో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వివాదం పవన్ ఫ్యాన్స్, మహేష్ కత్తి మధ్య రచ్చరచ్చగా మారడం, దాడులకు దారి తీసాయి. ఈ వివాదంలోకి అనూహ్యంగా పూనమ్ కౌర్ దూసుకొచ్చింది. పవన్‌కు మద్దతుగా కత్తి మహేష్‌పై పూనమ్ పదునైన వ్యాఖ్యలు చేసింది. దాంతో పవన్, పూనమ్ మధ్య ఏదో సంబంధం ఉందని కత్తి ఆరోపణలను గుప్పించారు. దాంతొ పూనమ్, కత్తి మహేష్ మధ్య తీవ్ర వివాదం నెలకొన్నది.

కత్తి మహేష్, పూనమ్ మధ్య వివాదం సవాళ్లు ప్రతీ సవాళ్లు విసురుకొనే వరకు వెళ్లింది. ఆ మధ్యలో కత్తిని టార్గెట్‌గా చేసుకొని పూనమ్ ట్వీట్లు, ఫేస్‌బుక్ పోస్టులతో హడలెత్తించింది. వివాదం తీవ్రమైన సందర్భంలో పూనమ్ కొన్ని ట్వీట్లను డిలీట్ చేయడం జరిగింది.

పూనమ్ వ్యాఖ్యల నేపథ్యంలో మహేష్ కత్తి తీవ్రమైన విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్‌కు నాలుగో భార్యగా ఉండేందుకు పూనమ్ సిద్ధమైంది అనే వ్యాఖ్యలను కూడా ఆయన చేశారు. ఇలాంటి పరిస్థితుల మధ్య పూనమ్ ఈ వివాదం నుంచి తప్పుకొన్నారు.

కాగా, తాజాగా మార్చి 17న హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సొసైటీలో ఓ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి మహేష్ కత్తి, పూనమ్ కౌర్ తదితరులను ఆహ్వానించారు. కార్యక్రమానికి ఆరంభానికి ముందే మహేష్ కత్తి అక్కడి వచ్చి వేదికపైకి వెళ్లారు. ఈవెంట్ ప్రారంభమైన కొద్ది సేపటికి పూనమ్ కౌర్ వచ్చారు.

పూనమ్ కౌర్ వేదిక వద్దకు వెళ్లేసరికి ముందు మహేష్ కత్తి కనిపించాడు. దాంతో అక్కడ ఉన్నవారిని పలకరించకుండా వెంటనే పూనమ్ కౌర్ తిరుగుముఖం పట్టింది. వడివడిగా నడుచుకొంటూ వేదిక వద్ద నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత తన కారులో ఈవెంట్‌లో పాల్గొనకుండానే పూనమ్ వెళ్లిపోయారు.

 

కత్తిని చూసి పూనమ్ వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఈవెంట్‌కు ముందు రోజు పూనమ్ కౌర్ పరోక్షంగా రాజకీయ విమర్శలు చేశారు. కొందరు కాన్సెప్ట్, డైలాగ్స్ కాపీ చేసి బట్టలు మార్చుకొంటున్నారు. మనషులను మారుస్తూ, మాట మీద ఉండకుండా ఉంటున్నారు. అమాయక జనాలతో ఆడుకొంటున్నారు. వేష, భాషలను మారుస్తూ జనాలను మభ్య పెడుతున్నారు. అమ్మాయిలను అడ్డం పెట్టుకొని కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విషయాల్లో నిజం ఏంటో భగవంతుడే తెలియజెప్పాలి. అందుకోసం భగవంతుడ్ని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను అని పూనమ్ ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios