క్రిష్ ని ఇరుకున పడేసిన పవన్ ?
కొంత షూటింగ్ కూడ జరుపుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా లేటవుతుందని, పిబ్రవరి, మార్చి దాకా షూటింగ్ ఉండదని భావించిన క్రిష్ ...వైష్ణవ్ తేజ తో ఓ చిత్రం షూటింగ్ ఆల్రెడీ మొదలెట్టారు. ఆ సినిమాలో నటిస్తున్న రకుల్ ..డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటోంది. ఆ సినిమా పూర్తి చేసి పవన్ సినిమా కు వద్దామనేది క్రిష్ ఆలోచన.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస బెట్టి సినిమాలు కమిటవుతున్నారు. ఇప్పటికే పింక్ తెలుగు రీమేక్ వకీల్ సాబ్ లో అమితాబ్ చేసిన పాత్రలో పవన్ చేస్తున్నాడు. దిల్ రాజు, బోణి కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కరోనా ఎఫెక్ట్ తో ఆగి, మళ్లీ మొదలవుతోంది. అక్టబర్ 26 నుంచి ఆయన నిరవధికంగా షూటింగ్ లో పాల్గొంటారు. . ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు.
ఇక ఈ సినిమాతో పవన్ మరో రెండు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో క్రిష్ జాగర్లమూడితో వస్తోన్న సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ మూవీగా వస్తోంది. కొంత షూటింగ్ కూడ జరుపుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా లేటవుతుందని, పిబ్రవరి, మార్చి దాకా షూటింగ్ ఉండదని భావించిన క్రిష్ ...వైష్ణవ్ తేజ తో ఓ చిత్రం షూటింగ్ ఆల్రెడీ మొదలెట్టారు. ఆ సినిమాలో నటిస్తున్న రకుల్ ..డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటోంది. ఆ సినిమా పూర్తి చేసి పవన్ సినిమా కు వద్దామనేది క్రిష్ ఆలోచన.
అయితే పవన్ కళ్యాణ్ మాత్రం నవంబర్ నుంచి డేట్స్ ఇస్తానని చెప్పారట. ఆ డేట్స్ తీసుకుని సినిమా ప్రారంభించుకోకపోతే ...మళ్లీ పవన్ దొరకాలంటే ఐదు నెలలు వెయిట్ చేయాలి. దాంతో క్రిష్ ఆలోచనలో పడిపోయారట. నవంబర్ లాస్ట్ నుండి # పవన్ 27 వర్క్ ని తిరిగి ప్రారంభించడానికి క్రిష్ సిద్ధంగా లేకుంటే, పవన్ కళ్యాణ్ వేరే ప్రాజెక్టుకు వెళతారు మరియు అది పూర్తయ్యే వరకు అతనికి అందుబాటులో ఉండదు. క్రిష్ ఇప్పుడు తన ప్రస్తుత ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలా లేదా # పవన్ 27 పూర్తి చేసే వరకు దానిని నిలిపివేయాలా అని డైలమోలో ఉన్నారట.
మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో అన్ని భాషాల్లో విడుదల చేయనుంది చిత్ర యూనిట్. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఏ యం రత్నం నిర్మిస్తున్నాడు.