Asianet News TeluguAsianet News Telugu

క్రిష్ ని ఇరుకున పడేసిన పవన్ ?

కొంత షూటింగ్ కూడ జరుపుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా లేటవుతుందని, పిబ్రవరి, మార్చి దాకా షూటింగ్ ఉండదని భావించిన క్రిష్ ...వైష్ణవ్ తేజ తో ఓ చిత్రం షూటింగ్ ఆల్రెడీ మొదలెట్టారు. ఆ సినిమాలో నటిస్తున్న రకుల్ ..డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటోంది. ఆ సినిమా పూర్తి చేసి పవన్ సినిమా కు వద్దామనేది క్రిష్ ఆలోచన.
 

Pawan  ready to give his dates to krish  from November
Author
Hyderabad, First Published Oct 7, 2020, 3:09 PM IST

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస బెట్టి సినిమాలు కమిటవుతున్నారు. ఇప్పటికే  పింక్‌ తెలుగు రీమేక్‌ వకీల్ సాబ్ లో   అమితాబ్ చేసిన పాత్రలో పవన్  చేస్తున్నాడు. దిల్ రాజు, బోణి కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కరోనా ఎఫెక్ట్ తో ఆగి, మళ్లీ మొదలవుతోంది.  అక్టబర్ 26  నుంచి ఆయన నిరవధికంగా షూటింగ్ లో పాల్గొంటారు.  . ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. 

ఇక ఈ సినిమాతో పవన్ మరో రెండు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో క్రిష్ జాగర్లమూడితో వస్తోన్న సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ మూవీగా వస్తోంది. కొంత షూటింగ్ కూడ జరుపుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా లేటవుతుందని, పిబ్రవరి, మార్చి దాకా షూటింగ్ ఉండదని భావించిన క్రిష్ ...వైష్ణవ్ తేజ తో ఓ చిత్రం షూటింగ్ ఆల్రెడీ మొదలెట్టారు. ఆ సినిమాలో నటిస్తున్న రకుల్ ..డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటోంది. ఆ సినిమా పూర్తి చేసి పవన్ సినిమా కు వద్దామనేది క్రిష్ ఆలోచన.

 అయితే పవన్ కళ్యాణ్ మాత్రం నవంబర్ నుంచి డేట్స్ ఇస్తానని చెప్పారట. ఆ డేట్స్ తీసుకుని సినిమా ప్రారంభించుకోకపోతే ...మళ్లీ పవన్ దొరకాలంటే ఐదు నెలలు వెయిట్ చేయాలి.  దాంతో క్రిష్ ఆలోచనలో పడిపోయారట. నవంబర్ లాస్ట్ నుండి # పవన్ 27  వర్క్ ని తిరిగి ప్రారంభించడానికి క్రిష్ సిద్ధంగా లేకుంటే, పవన్ కళ్యాణ్ వేరే ప్రాజెక్టుకు వెళతారు మరియు అది పూర్తయ్యే వరకు అతనికి అందుబాటులో ఉండదు. క్రిష్ ఇప్పుడు తన ప్రస్తుత ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలా లేదా # పవన్ 27 పూర్తి చేసే వరకు దానిని నిలిపివేయాలా అని డైలమోలో ఉన్నారట.

మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో ఈసినిమాను పాన్ ఇండియా లెవల్‌లో అన్ని భాషాల్లో విడుదల చేయనుంది చిత్ర యూనిట్.  ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఏ యం రత్నం నిర్మిస్తున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios