చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్ కన్నుమూశారు.
చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్(51) కన్నుమూశారు. జాతీయ అవార్డు గ్రహీత అయిన విక్రమ్ గౌక్వాడ్ బాలీవుడ్లో మేకప్ ఆర్టిస్ట్ గా చాలా పాపులర్. చాలా మంది స్టార్స్ కి ఆయన పనిచేశారు. ప్రధానంగా బాలీవుడ్ తోపాటు మరాఠీ అలాగే, సౌత్ మూవీస్కి కూడా వర్క్ చేశారు.
విక్రమ్ గైక్వాడ్ పని చేసిన చిత్రాల్లో `పానిపట్`, `బెల్బాటమ్`, `ఉరి`,`బ్లాక్ మెయిల్`, `దంగల్`, `పీకే`, `సూపర్30`, `కేదార్ నాథ్` వంటి చిత్రాలకు ఆయన పనిచేశారు. అవి మంచి పేరుని తీసుకు వచ్చాయి. `డర్టీ పిక్చర్` మూవీకి నేషనల్ అవార్డు వరించింద. పలు సినిమాలకు ఐఐఎఫ్ఏ, ఎఫ్ఓఐ పురస్కారాలు వరించాయి. అంతేకాదు పలు చిత్రాల్లో నటుడిగానూ మెప్పించారు విక్రమ్ గైక్వాడ్.
విక్రమ్ గైక్వాడ్ మృతికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే సంతాపం తెలిపారు. ఆయన మరణం తీరని లోటు అన్నారు. మరికొందరు సినీ ప్రముఖులు గైక్వాడ్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని వెల్లడించారు. అయితే గైక్వాడ్ మృతికి కారణం ఏంటనేది తెలియరాలేదు.