‘రాధేశ్యామ్’ క్లైమాక్స్ పై కెమెరామెన్ రివీల్ చేసిన షాకింగ్ ట్రూత్
ఈ చిత్రంలో క్లైమాక్స్ చాలా స్పెషల్గా ఉంటుందని , చాలా కాలం గుర్తుండిపోతుందని చెప్తున్నారు.ఇంతకీ ఆ స్పెషల్ క్లైమాక్స్ ఏమిటి...అనే విషయమై రాధేశ్యామ్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస మీడియాతో మాట్లాడారు.
ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం రాధేశ్యామ్. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో క్లైమాక్స్ చాలా స్పెషల్గా ఉంటుందని , చాలా కాలం గుర్తుండిపోతుందని చెప్తున్నారు.ఇంతకీ ఆ స్పెషల్ క్లైమాక్స్ ఏమిటి...అనే విషయమై రాధేశ్యామ్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస మీడియాతో మాట్లాడారు.
మనోజ్ మాట్లాడుతూ...“ నేను దాదాపుగా సంవత్సరం నుంచి రాధేశ్యామ్ క్లైమాక్స్ పై పనిచేస్తున్నాను. అలాంటి క్లైమాక్స్ ని ఎగ్జిక్యూట్ చేయటం, ఒప్పించటం అంత ఈజీ కాదు. కంటిన్యూగా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాము. మా ప్రేక్షకులకు ఇంట్రస్టింగ్ విషయాలు క్లైమాక్స్ లో ఇవ్వబోతున్నాము ,” అన్నారు.
ఇక రాధేశ్యామ్ పై ట్రేడ్ లో, పాన్ ఇండియా మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే రాధేశ్యామ్ క్లైమాక్స్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అని, రాధేశ్యామ్ క్లైమాక్స్ విషాదాంతంగా ముగియబోతుంది అనే ప్రచారం ఉండగా.. ఇప్పుడు రాధేశ్యామ్ క్లైమాక్స్ పదిహేను నిమిషాల పాటు ఉంటుందట. ఈ పదిహేను నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం యూవీ క్రియేషన్స్ వారు ఏకంగా యాబై కోట్లు ఖర్చు పెట్టి చిత్రీకరించారట. ఈ రాధేశ్యామ్ క్లైమాక్స్ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా చక్కటి యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కించారు.
Also read రజినీకాంత్ ముఖానికి లిప్స్టిక్... ఆ పని చేసింది ఎవరో తెలుసా!
‘రాధేశ్యామ్’ సినిమాను ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నారు. రెబల్స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలకానుంది. ప్రభాస్ సరసన హీరోయిన్గా పూజాహెగ్డే నటిస్తోంది.
Also read బ్రేకప్ తర్వాత రెమ్యునరేషన్ పెంచేసిన సమంత.. చాలా దూరంలో పూజ, రష్మిక ?