మంచు విష్ణు నటించిన `కన్నప్ప` చిత్రానికి సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ చేసిన హార్డ్ డ్రైవ్ మిస్‌ అయి విషయం తెలిసిందే. అయితే మంచు విష్ణు.. తన తమ్ముడు మనోజ్‌పై అనుమానం వ్యక్తం చేయడం షాకిస్తుంది.

మంచు విష్ణు, మంచు మోహన్‌బాబు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం `కన్నప్ప`. సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. 

ఇందులో మంచు విష్ణుతోపాటు ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌ కుమార్‌ వంటి స్టార్స్ నటించడంతో సినిమాపై భారీ హైప్‌ నెలకొంది. వచ్చే నెలలో(June 27) సినిమా కూడా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో షాకిచ్చే విషయం ఇటీవల బయటకు వచ్చింది.

`కన్నప్ప` మూవీ వీఎఫ్‌ఎక్స్ హార్డ్ డ్రైవ్‌ మాయం

`కన్పప్ప` వీఎఫ్‌ఎక్స్ చేసిన కంటెంట్‌ ని ముంబయింకి చెందిన హెచ్‌ఐవీఈ స్టూడియోస్‌ సంస్థ హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఉన్న మంచు విష్ణు ప్రొడక్షన్‌ ఆఫీస్‌ 24 ఫ్రేమ్స్ సంస్థకి డీటీడీసీ కొరియర్‌ ద్వారా పంపించారు. 

 ఈ డ్రైవ్‌ని తీసుకుని రఘు, చరిత అనే ఇద్దరు పారిపోయారని, ఇప్పుడు కనిపించడం లేదని `కన్నప్ప` సినిమాకి సంబంధించిన ఎగ్జిక్యూటీవ్‌ ప్రొడ్యూసర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయం లేట్‌గా బయటకు వచ్చింది.

తమ్ముడు మనోజ్‌పైనే అనుమానం వ్యక్తం చేసిన మంచు విష్ణు

ఈ క్రమంలో ఈ దొంగతనంపై ఇప్పటికే మంచు విష్ణు సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు. ఇది పెద్ద కుట్ర అని తెలిపారు. అదే సమయంలో శివయ్యా మాకే ఎందుకు ఈ పరీక్ష అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. 

తాజాగా దీనిపై స్పందించారు మంచు విష్ణు. `కన్నప్ప` చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఈ విషయంపై మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ఆఫీస్‌లో పనిచేసే రఘు, చరితనే ఈ హార్డ్ డ్రైవ్ దొంగిలించారని ఆయన స్పష్టం చేశారు.

అయితే వీరిద్దరు మంచు మనోజ్‌ ఇంట్లోనే పని చేస్తారని, వాళ్లు సొంతంగానే ఈ పని చేశారా? ఎవరైనా చెబితే చేశారా? అనేది తెలియాల్సి ఉందన్నారు. పరోక్షంగా తమ్ముడు మనోజ్‌పై మంచు విష్ణు ఆరోపణలు చేశారు. ఆయన చెప్పడం వల్లే వీళ్లు చేశారా? అనే అనుమానాన్ని మంచు విష్ణు వ్యక్తం చేయడం రచ్చ అవుతుంది.

`కన్నప్ప` హార్డ్ డ్రైవ్‌ మాయం వెనుక అనేక అనుమానాలు

ఇదిలా ఉంటే ఎప్పుడో రెండు నెలల క్రితం పంపిన ఈ హార్డ్ డ్రైవ్‌ ఇప్పుడు ఎలా మిస్‌ అయ్యింది? ఇక కోట్ల విలువ చేసే సినిమాకి సంబంధించిన హార్డ్ డ్రైవ్‌ని కొరియర్‌ ద్వారా పంపించడం ఏంటి? ఆ సమాచారం మంచు విష్ణుకి తెలియకపోవడమేంటి? 

అదే సమయంలో ప్రస్తుతం టీమ్‌ పని చేస్తున్న కంపెనీ అడ్రస్‌కి కాకుండా మరో ఆఫీస్‌ అడ్రెస్‌కి ఆ హార్డ్ డ్రైవ్‌లను పంపడమేంటనేది అనుమానంగా మారంది. మరి ఏం జరగబోతుందో మున్ముందు తేలనుంది.