దేశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కిన మంచు విష్ణు  ఉత్తరాది  దక్షిణాది ప్రాంతాలను రెండు వేర్వేరు దేశాలుగా విడగొట్టల‌న్న విష్ణు

దక్షిణాది ప్రజలు నిర్ణయిస్తేనే ఢిల్లీలో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. కానీ, మనకు మాత్రం ఉత్తరాది నుంచి సరైన గుర్తింపు రావడం లేదు. అలాంటప్పుడు కలిసి ఉంటే లాభం ఏంటి? కాబట్టి ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలను రెండు వేర్వేరు దేశాలుగా విడగొట్టేస్తేనే బాగుంటుంది. సరైన గుర్తింపు రానప్పుడు కలిసి ఉండడం కన్నా విడిపోవడమే బెటర్’’ అని సంచలన కామెంట్స్ చేశాడు.

 ‘‘శాంతియుత పోరాటం వల్లే స్వాతంత్ర్యం వచ్చిందని....జల్లికట్టు పోరాటం మనకు గుర్తు చేస్తోంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఆ పోరాటానికి నా నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ కామెంట్ మాట ఎలా ఉన్నా.. విష్ణు దేశ విభజన కామెంట్లపై యువత ఎలా స్పందిస్తుందో మరి.