తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాపై ట్వీట్ పెట్టారు. 'గీత గోవిందం గెలిచింది. సినిమా చూస్తూ ఎంజాయ్ చేశాను. విజయ్ దేవరకొండ, రష్మిక చాలా బాగా నటించారు. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ గురించి ప్రత్యేకంగా చెప్పకోవాలి. సినిమా యూనిట్ కి కంగ్రాట్స్' అంటూ ట్వీట్ పెట్టారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్న జంటగా నటించిన చిత్రం 'గీత గోవిందం'. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదలైన సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో హాఫ్ మిలియన్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాను చూసిన రాజమౌళి, చిరంజీవి వంటి ప్రముఖులు సినిమా యూనిట్ ని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాపై ట్వీట్ పెట్టారు.
'గీత గోవిందం గెలిచింది. సినిమా చూస్తూ ఎంజాయ్ చేశాను. విజయ్ దేవరకొండ, రష్మిక చాలా బాగా నటించారు. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ గురించి ప్రత్యేకంగా చెప్పకోవాలి. సినిమా యూనిట్ కి కంగ్రాట్స్' అంటూ ట్వీట్ పెట్టారు.
దీన్ని రీట్వీట్ చేస్తూ వెన్నెల కిషోర్.. 'ఈరోజు నాకు చాలా స్పెషల్ గా మార్చారు సార్. మిలియన్ థాంక్స్ మీకు. రియల్లీ స్వీట్ ఆఫ్ యు' అంటూ తన ఆనందాన్ని తెలియజేశారు. ప్రస్తుతం మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' అనే సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది కూడా చదవండి:
