గుజరాత్ లోని అహ్మదాబాద్ చేరుకున్న మహేష్ బాబు మురుగదాస్ దర్శకత్వంలో మూవీ షూటింగ్ కోసం టూర్ అహ్మదాబాద్ లో కీలక సన్నివేశాల షూటింగ్ లో సూపర్ స్టార్
మహేశ్ బాబు మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరిగిపోతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి కీలక సన్నివేశాలను హైదరాబాద్ .. చెన్నైలలో భారీస్థాయిలో చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్.. అహ్మదాబాద్ లో ప్లాన్ చేశారు. రేపటి నుంచి ఈ షెడ్యూల్ ప్రారంభమై .. దాదాపు నెల రోజులపాటు కొనసాగనుంది. ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనేందుకు మహేష్ బాబు అహ్మదాబాద్ చేరుకున్నారు.
ఈ నెల 27వ తేదీ నుంచి మహేశ్ ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నాడు. సినిమాలో కీలకంగా కనిపించే భారీ యాక్షన్ ఎపిసోడ్ ను అక్కడ చిత్రీకరించనున్నారు. రకుల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, విలన్ గా ఎస్.జె.సూర్య కనిపించనున్నాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే నమ్మకంతో మహేశ్ అభిమానులు వున్నారు.
