Asianet News TeluguAsianet News Telugu

రెండు భాగాలుగా మహేష్ బాబు-రాజమౌళి మూవీ... స్క్రిప్ట్ అలా లాక్ చేస్తున్న జక్కన్న!

మహేష్ బాబుతో మొదటిసారి మూవీ చేస్తున్న రాజమౌళి రెండు భాగాలుగా తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారట. ఈ మేరకు స్క్రిప్ట్ కంప్లీట్ చేస్తున్నారని టాలీవుడ్ టాక్. 
 

mahesh babu rajamouli project to be release in two parts ksr
Author
First Published Nov 13, 2023, 3:32 PM IST

కెరీర్లో మొదటిసారి మహేష్ బాబు, రాజమౌళి కలిసి వర్క్ చేయబోతున్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ సమయంలోనే రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో అని ప్రకటించారు. మహేష్ తో మూవీ బాహుబలికి ముందే చేయాల్సింది. అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా రాజమౌళి తన రైటింగ్ టీమ్ కి కీలక సూచనలు చేశాడట. 

రాజమౌళి మహేష్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కించాలని అనుకుంటున్నారట. ఇందుకు అనుకుణంగా స్క్రిప్ట్ ప్రిపేర్ చేయాలని బావిస్తున్నారట. రెండో భాగం మీద ఆసక్తి కలిగేలా మొదటి భాగం ముగింపు, ట్విస్ట్ లతో స్క్రీన్ ప్లే సిద్ధం చేయిస్తున్నారట. ఈ మేరకు విజయేంద్రప్రసాద్ తో కూడిన టీమ్ పని చేస్తుందట. కాబట్టి బాహుబలి మాదిరి మహేష్ బాబు మూవీ కూడా రెండు భాగాలుగా భారీ ఎత్తున విడుదల కానుందట. 

ఈ మేరకు టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం. రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా అని చెప్పారు. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా మహేష్ బాబు పాత్ర ఉంటుందని వెల్లడించారు. హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారు. రాజమౌళి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో మహేష్ మూవీ తెరకెక్కనుంది. త్వరలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారని సమాచారం. 

ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం షూటింగ్లో బిజీగా ఉన్నారు . దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న గుంటూరు కారం మూవీ 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలకానుంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంది. 


Also Read దిమ్మతిరిగేలా ‘గుంటూరు కారం’బిజినెస్,లెక్కలు ఇవిగో

 

Follow Us:
Download App:
  • android
  • ios