నిడివి ఎక్కువగా ఉండడంతో 'మహానటి' సినిమాను మూడు గంటలకు కుదించి 

నిడివి ఎక్కువగా ఉండడంతో 'మహానటి' సినిమాను మూడు గంటలకు కుదించి సినిమా విడుదల చేసింది చిత్రబృందం. ఎడిటింగ్ లో చాలా సన్నివేశాలను తీసేశారు. ఇప్పుడు సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే నాలుగు గంటల పటు సినిమా ఉన్నా.. ఆడియన్స్ చూసేలా ఉన్నారు. అయితే అలా ఎడిట్ చేసిన సన్నివేశాలను చిత్రబృందం ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. తాజాగా మరో సీన్ ను విడుదల చేసింది. ఇందులో చౌదరి(రాజేంద్రప్రసాద్).. సావిత్రి(కీర్తి సురేష్)ని తీసుకొని మద్రాస్ వెళ్లడానికి సహాయం చేయమని పెదబాబు గారిని అడగడానికి ఆయన పొలానికి వెళ్తారు. అర నిమిషం గల ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred