శ్రీదేవి స్థానంలో మాధురి దీక్షిత్.. ఫోటో షేర్ చేసిన జాహ్నవి
- శ్రీదేవి స్థానంలో మాధురి దీక్షిత్
- శ్రీదేవి నటించాల్సిన కరణ్ మూవీలో మాధురి
- ఫోటో షేర్ చేసిన జాహ్నవి
అతిలోక సుందరి శ్రీదేవిని మరణం నుండి, ఆమె ఙ్జాపకాల నుండి పూర్తిగా కోలుకోలేకపోతుంది కూతురు జాహ్నవి. అమ్మకు అత్యంత సన్ననిహితురాలు, స్నేహితురాలు, కూతురు అయిన జాహ్నవి శ్రీదేవి హఠాన్మరణంతో ఒక్క సారిగా షాక్ తింది. తన తల్లిని స్మరించని క్షణం లేదంటే అతిశయోక్తి కాదు. దానికి ఋజువు ఆమె ఇన్స్టాగ్రామ్ లో భావోద్వేగం తో చేసిన పోస్ట్ లే.
బోనీ కపూర్ తో వివాహనంతరం వెండితెరకు వీడ్కోలు చెప్పేసిన శ్రీదేవి, కొన్ని రోజుల క్రితం "ఇంగ్లీష్ వింగ్లీష్" సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. చివరగా "మామ్" లో నటించారు శ్రీదేవి. ఈ రెండు సినిమాలతోనే తన పూర్వవైభవాన్ని తిరిగి అందిపుచ్చుకున్న శ్రీదేవితో వరుస చిత్రాలను చేసేందుకు బాలీవుడ్ నిర్మాతలు "క్యూ" లో నిలబడ్డారు.
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ నిర్మిస్తున్న ఒక చిత్రంలో శ్రీదేవి నటిచాల్సి ఉండగా, శ్రీదేవి మరణంతో ఆ స్థానాన్ని మాధురి దీక్షిత్తో భర్తీ చేయాలని నిర్ణయించారు ఆయన. ఈ విషయాన్ని తెలియజేస్తూ "ఇన్స్టాగ్రామ్" లో భావోద్వేగంతో కూడిన ఒక పోస్టు చేసింది కూతురు జాహ్నవి. కరణ్ జోహార్ నిర్మాణసారధ్యంలో అభిషేక్ వర్మన్ (2 స్టేట్ ఫేం) తెరకెక్కిస్తున్న తాజా చిత్ర కథ అమ్మ హృదయానికి హత్తుకుంది.
"చాలా వరకూ అమ్మను గుర్తు చేస్తుంది ఈ చిత్రం. ఈ అందమైన చిత్రంలో భాగం కాబోతున్న మాధురిజీకి... డాడీ తరపున ఖుషీ, నా తరుపున చాలా కృతఙ్జతలు" అంటూ మాధురి దీక్షిత్, శ్రీదేవి కలిసి దిగిన ఫోటోని షేర్ చేసింది జాహ్నవి. ప్రస్తుతం జాహ్నవి షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్గా మారింది. అమ్మ అమ్మే కదా! మరపు చాలా అసాధ్యం. అయితే నాడు శ్రీదేవికి చిత్రసీమలో సరైన పోటీ మధురి మాత్రమే. అయినా ఇద్దరు మంచి స్నేహితులు. బహుశ మాధురి ఆ సినిమాకు న్యాయం చేసి శ్రీదేవికి మరో సారి మన స్మృతిపథం లోకి తెస్తుందెమో! అయితే ఆ సినిమా పేరు "షిదాత్" అంటే "ఇష్టంగా నిరీక్షించటం" సరే ఎదురుచూద్ధాం మరి.
#madhuridixit Will Be the part of #jahnavikapoor and #IshaanKhattar first film #Dhadak @MadhuriDixit #sridevi pic.twitter.com/6yfzVm625k
— Bollywood Googly (@BollywoodGoogly) March 19, 2018