Padamati Sandhyaragam: జీ తెలుగులో ప్రసారమవుతున్న పడమటి సంధ్యారాగం సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుంది. రెండు భిన్న సంప్రదాయాల మధ్య పెరిగిన ఇద్దరు అక్కచెల్లెళ్లు కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

ఎపిసోడ్ ప్రారంభంలో వెళ్లిపోతున్న పద్మ ని ఆగమని వాళ్ళ తరుపున నేను క్షమాపణ అడుగుతున్నాను ఈ ఒక్కసారికి క్షమించు. ఇకమీదట మళ్లీ పొరపాటు చేస్తే నేనే వాళ్ళని వదిలేస్తాను అని ఏడుస్తూ రఘురాం ని  బ్రతిమాలుతుంది అతని తల్లి. మన కట్టుబాట్లని అయిన వాళ్ల కోసం వదులుకోవటం భావ్యం కాదు అయినా నీ మాటకి విలువిస్తున్నాను.

 వాళ్లని లోపలికి రమ్మని చెప్పు అంటూ లోపలికి వెళ్ళిపోతాడు రఘురాం. ఆనందపడుతూ గబగబా పోతుల దగ్గరికి వెళ్లి పదా లోపలికి ఉంటుంది పద్మ తల్లి. ఏ భార్యకైనా భర్త వల్లే విలువ. మరెప్పుడూ ఇలాంటి తప్పు చేసి నన్ను పలుచన చేయకండి అంటూ ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది పద్మ. ఆ తర్వాత  నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఏడుస్తుంది పద్మ. సంపాదన లేని భర్త ఉంటే ఆడదానికి  అదే పెద్ద నరకం అంటుంది పద్మ తల్లి.

ఆ విషయంలో జానకి అక్క చాలా అదృష్టవంతురాలు అయినా ఆవిడ పద్ధతి నాకేమీ నచ్చలేదు రామలక్ష్మి విషయంలో ఏడ్చి గోలపెట్టి అనుకున్నది సాధించింది. మీ విషయానికి వచ్చేసరికి ఏమి పట్టనట్లు ఊరుకుంది అంటూ జానకి మీద చాడీలు చెప్తుంది పార్వతి. ఎవరు ఉన్నా లేకపోయినా నా బిడ్డకి నేను ఉన్నాను అంటూ కూతురికి ధైర్యం చెబుతుంది పద్మ తల్లి.

 మరోవైపు రామలక్ష్మి హాకీ కోచింగ్ కి రమ్మంటాడు కోచ్. మా ఇంట్లో ఒప్పుకోరు సార్ హాకీ పట్టుకున్నానని తెలిస్తే ఉన్న చదువు కూడా దూరమైపోతుంది దయచేసి ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది రామలక్ష్మి. వీళ్ళ ఇంట్లో ఇన్ని పద్ధతులు కట్టుబాట్లు ఉంటాయా.. రామలక్ష్మి ఆడకపోతే ఆటకే పెద్ద నష్టం అనుకుంటాడు కోచ్. సీన్ కట్ చేస్తే కిషోర్, జానకి కి ఫోన్ చేస్తాడు.

ఆధ్య గురించి వివరాలు కనుక్కుంటాడు. మీ చెల్లెలు మీ దగ్గర మాట తీసుకుందని ఊరుకున్నాను కానీ నా కూతుర్ని వదిలి ఉండలేకపోతున్నాను అంటాడు కిషోర్. ఇక్కడ అతను చాలా బాగుంది అందరిలోనూ కలిసిపోయింది మీరేమీ బెంగపడకండి అంటుంది జానకి. త్వరలోనే ఆధ్య పుట్టినరోజు ఉంది తన బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి ఆ రోజు నేను కూడా వస్తాను.

తనకి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కిషోర్. అంతలోనే శీను వచ్చి ఎవరు ఫోన్ అని అడుగుతాడు. కిషోర్ గారు ఫోన్ చేశారు ఆధ్యకి త్వరలో పుట్టినరోజంట అని చెప్తుంది. చాలా ఆనంద పడిపోతాడు శీను. నువ్వు ఎందుకు అంత ఆనంద పడుతున్నావు నీ పెళ్ళెప్పుడు కూడా ఎంత ఆనంద పడలేదు అంటుంది జానకి.

అలాంటిదేమీ లేదా అత్తయ్య తను మన ఇంట్లో ఫస్ట్ టైం సెలబ్రేట్  చేసుకోబోతుంది కదా అందుకే అంటాడు శీను. కిషోర్ గారు ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారంట బహుశా అధ్య ని తీసుకెళ్లిపోతారేమో అంటుంది జానకి. ఒకసారిగా షాకవుతాడు శీను. మరోవైపు చారు తల్లిదండ్రులు గోల్డ్ తీసుకొని రఘురాం ఇంటికి వస్తారు. పెళ్లికి వస్తారు అనుకున్నాము కానీ ఇప్పుడే వచ్చేసారు అంటుంది పద్మ తల్లి.మా అల్లుడు కోసం బంగారం తీసుకువచ్చాము.

 పెళ్లయిన తర్వాత ఆస్తంతా మా అల్లుడిదే కదా అంటారు చారు తల్లిదండ్రులు. ఏమాత్రం ఉంటుంది ఏంటి ఒక పాతిక కోట్లు ఉంటుందా అంటూ వేళాకోళమడతాడు వెంకటరావు. ఏమాత్రం బంగారం తెచ్చారో అంటుంది పద్మ. చూస్తుంటే నువ్వు ఆస్తి కోసమే ఈ సంబంధం చేసుకుంటున్నట్లుగా ఉంది అంటాడు పద్మ తమ్ముడు. బ్యాగ్ లోంచి బంగారం బయటికి తీసి మీరు అనుమతిస్తే మా అల్లుడికి ఈ బంగారం ఇద్దాం అనుకుంటున్నాను అని రఘురాంని అడుగుతారు చారు తల్లిదండ్రులు.

ఇప్పుడు శీను మా ఇంటి అబ్బాయి కాదు మీ ఇంటి అబ్బాయి కూడా ఇందులో నా అనుమతి ఏముంది అంటాడు రఘురాం. ఆ మాటలకి సంతోషించిన చాలు తల్లిదండ్రులు బంగారం తీసుకెళ్లి శీనుకి ఇస్తారు. నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు అంటూ నిరాకరిస్తాడు శీను. జానకి చెప్పినా వినిపించుకోడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.