కిరాక్ పార్టీ 3 రోజల వసూళ్లు
- నిఖిల్ హీరోగా తెరకెక్కిన 'కిరాక్ పార్టీ'
- విడుదలైన ప్రతిచోటా భారీ వసూళ్లు
- ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చిన నిఖిల్
నిఖిల్ కథానాయకుడిగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో 'కిరాక్ పార్టీ' సినిమా తెరకెక్కింది. సిమ్రాన్ పరింజా .. సంయుక్తా హెగ్డే కథానాయికలుగా నటించిన ఈ సినిమా, ఈ నెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తొలిరోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 4.50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. నిఖిల్ కెరియర్లోనే భారీ ఓపెనింగ్స్ ను తెచ్చిపెట్టిన సినిమాగా నిలిచింది.
మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 15 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టింది. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా, మొదటి మూడు రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లను సాధించడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఈ సినిమా లాభాల బాట పట్టడానికి ఎన్నో రోజులు పట్టదనే విషయం స్పష్టంగా తెలిసిపోతూనే వుంది. ప్రేక్షకుల ఆదరణ వల్లనే ఈ స్థాయి సక్సెస్ సాద్యమైందంటూ .. ఆదివారం రాత్రి ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చిన నిఖిల్, ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
After 3 days of Super Run at the BOX OFFICE... It's time for the Boys to do KIRRAK PARTYYY... This success belongs to every person who took time to watch the film 😍😘😘😘Love u Soo much. 😍😍 pic.twitter.com/lONiZZuMxi
— KIRRAK PARTY 16thMARCH (@actor_Nikhil) March 18, 2018